నిబద్ధత కలిగిన వారిని పార్టీలో భాగస్వాములను చేయండి – నాగబాబు
విశాలాంధ్ర – భోగాపురం : నిబద్ధత కలిగిన వారిని పార్టీలో భాగస్వాములను చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. శాసనసభ్యులు లోకం నాగ మాధవి క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొణిదెల నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పారదర్శకమైన రాజకీయాల కోసం జనసేన కృషి…


