విశాలాంధ్ర ధర్మవరం;;ఫిట్ ఇండియా ఉద్యమం కింద ఆదివారం ప్రపంచ సైకిల్ దినోత్సవo సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు, శ్రీ సత్య సాయి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆద్వర్యములో ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి గాంధీ నగర్ సర్కిల్ వరకు సైకిల్ ర్యాలీని నిర్వహించారు.ముఖ్య అతిధిగా సీనియర్ హాకి కోచ్ యస్. హస్సైన్” ఆకుపచ్చ జండా ఊపి సైకిల్ రాలిని ప్రారంబించారు. అనంతరం సైకిల్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గూర్చి వివరించారు.ఈ కార్యక్రమములో ఫెన్సింగ్ కోచ్ ప్రతాప్, జూడో కోచ్ రెడ్డెప్ప రెడ్డి, కరాటే కోచ్ ఇన్నాయతుల్లా, జూనియర్ అసిస్టెంట్ కుమార్, క్రీడా కారులు పాల్గొన్నారు.


