తిరుపతి నగరంలో జరుగుతున్న గంగమ్మ జాతర వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పలు రాజకీయ అంశాలపై స్పందించారు. తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ ను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారనే ప్రచారం వాస్తవాలకు దూరమని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారానికి పాల్పడుతోందని విమర్శించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు ఇప్పటికే అలాంటి రాజకీయాలను తిరస్కరించారని మంత్రి పేర్కొన్నారు.#ministersatyakumar #ysjagan #vijaythalapathy
Source link


