విజయవాడ రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
విజయవాడలోని ప్రముఖ రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రిలో బుధవారం భారీ ప్రమాదం తప్పింది. విజయవాడ ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులో విద్యుదాఘాతం కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి. అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించడంతో రోగులు ఆందోళన చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎమర్జెన్సీ వార్డులో పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. ఎలక్ట్రికల్ బోర్డులో మంటలు ప్రారంభమవడమే కాకుండా, వార్డు మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఊపిరాడక, ఏం జరుగుతుందో తెలియక…


