Simhachalam Temple | సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేడుకలు
సింహాచలం సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం కోసం చందనం అరగదీత ప్రక్రియ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఏడాది పొడవునా గంధపు పూతతో దర్శనమిచ్చే స్వామివారు, కేవలం వైశాఖ శుద్ధ తదియ నాడే తన నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ పవిత్ర చందనోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాయపలకలపై మూడు మణుగుల చందనాన్ని తొలి విడతగా అరగదీయడం విశేషం. Source link


