అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలోని ఎస్ఎన్ఎల్ కాలనీలో గురువారం అగ్నిమాపక శాఖ అధికారుల ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాక్ డ్రిల్ నిర్వహించి, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఫైర్ స్టేషన్ అధికారి భీమ లింగయ్య మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు గందరగోళానికి గురికాకుండా తక్షణమే అగ్నిమాపక శాఖకు…


