ముదిగుబ్బలో ఆ స్థలానికి 22-ఏ నిషేధిత జాబితా నుంచి విముక్తి
250కుటుంబాలకు మేలు చేకూర్చేలా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఉత్తర్వులువిశాలాంధ్ర ధర్మవరం;;ముదిగుబ్బ మండల కేంద్రంలో 250కుటుంబాలకు గత కొన్నేళ్లుగా ఉన్న సమస్యకు ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ చొరవతో పరిష్కారం లభించింది. గుంజేపల్లి పొలంలోని సర్వే నెంబర్ 905-ఏలోని 3ఎకరాలను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో ఒక నెల-ఒక నియోజకవర్గం- నాలుగు సందర్శనలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…


