యాడికి మండలంలో ఈదురుగాలుల బీభత్సం.. – Visalaandhra
యాడికి మండలంలో నేలకొరిగిన అరటి, నిమ్మ తోటలు కుప్పకూలిన విద్యుత్ స్తంభాలు… విశాలాంధ్ర-యాడికి: యాడికి మండలంలోని లక్షుంపల్లె, కేశవరాయునిపేట, దైవాలమడుగు గ్రామాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి.ముఖ్యంగా లక్షుంపల్లె గ్రామంలో విస్తారంగా సాగుచేసిన అరటి తోటలు పూర్తిగా నేలకొరిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే నిమ్మ తోటలు…


