Palnadu: హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం.. పల్నాడులో యువ న్యాయవాది దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్ వార్తలు
ప్రమాదం కాదు.. ప్రణాళికాబద్ధమైన హత్య? ఈనాడు కథనం ప్రకారం.. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఒంగోలు పట్టణంలోని కర్నూలు రోడ్డు నివాసి అయిన హరిప్రసాద్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం హైకోర్టు పని మీద వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఆయన బయలుదేరారు. రాత్రి 8:43 గంటల సమయంలో ఇంటివారితో ఫోన్లో మాట్లాడిన ఆయన, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. శుక్రవారం తెల్లవారుజామున చిలకలూరిపేట మండలం యడవల్లి పరిధిలోని రోడ్డు పక్కన ఆయన మృతదేహం…


