50 శాతం సీట్ల పెంపుపై కేంద్రం కసరత్తు!

పాత బిల్లు ఆధారంగా కొత్త ముసాయిదా న్యూఢిల్లీ:మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ముసాయిదాను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అదే సమయంలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్‌సభలో తమ రాజకీయ ప్రాబల్యం తగ్గుతుందన్న దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని… ఆయా రాష్ట్రాల లోక్‌సభ స్థానాల సంఖ్యను 50 శాతం పెంచేందుకు వీలుగా ప్రభుత్వం అనేక ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ…

Read More

వ్యాపారులతో లో కళ్యాణ్ మేలపై అవగాహన సదస్సు..

మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్యవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పురపాలక సంఘం ప్రాంగణంలో దాదాపు 87 మంది వీధి వ్యాపారులతో లోక్ కళ్యాణ్ మేలపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి సత్య కుమార్ ఆదేశాల మేరకు పట్టణస్థాయి కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వామిజి 2.0 లోక్ కళ్యాణ్ మేల పథకం ద్వారా వీధి విక్రయదారులు చిన్న వ్యాపారులు చేసుకునే వారికి పీఎంఎస్…

Read More

ప్రజల ఇక్కట్లు తీర్చేలా కాజ్‌వే నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి

-ఎమ్మెల్యే పరిటాల సునీత విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : నియోజకవర్గ కేంద్రం రాప్తాడు నుంచి చిన్మయనగర్, జేఎన్టీయూ మీదుగా అనంతపురం నగరానికి వెళ్లే మార్గంలో పండమేరు వాగుపై నిర్మిస్తున్న లో-లెవెల్ కాజ్‌వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. సోమవారం కాజ్ వే నిర్మాణ పనులను నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు….

Read More

కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాల్లో కౌలుట్లయ్య లేని లోటు.. భక్తుల చర్చ..

విశాలాంధ్ర–నార్పల: మండల పరిధిలోని గూగుడు గ్రామంలో 13 రోజులుగా వైభవంగా నిర్వహించిన శ్రీ కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం స్వామివారి చివరి దర్శనంతో ముగిశాయి. ఈ సందర్భంగా గత ఏడాది బ్రహ్మోత్సవాల నిర్వహణను గుర్తు చేసుకుంటూ పలువురు భక్తులు మాజీ శింగనమల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కౌలుట్లయ్య సేవలను స్మరించుకున్నారు. గత ఏడాది శింగనమల సీఐగా విధులు నిర్వహించిన కౌలుట్లయ్య బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీసు బందోబస్తును సమర్థవంతంగా నిర్వహించారని భక్తులు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ…

Read More

మృతుని కుటుంబానికి మాజీ సర్పంచ్ ఆర్థిక సహాయం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామానికి చెందిన ఈరన్న అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జాలవాడి మాజీ సర్పంచ్ రామన్న సోమవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం తన వంతు సహాయంగా 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ అధ్యక్షులు వెంకన్న, అబ్బిలి భీరలింగేష్, ఉలిగప్ప, చిన్న లక్ష్మన్న, భీమేష్, చిన్న…

Read More

నగదు, సెల్ ఫోన్లను అందజేసిన ధర్మవరం జి ఆర్ పి రైల్వే పోలీసులు

విశాలాంధ్ర ధర్మవరం;; కర్ణాటక రాష్ట్రం పావగడలోని వై ఎన్ ఎస్ కోట గ్రామానికి చెందిన ఫయాజ్ భాష నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగకు వెళ్లి తిరిగి వచ్చు ప్రయాణంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో తన స్వగ్రామానికి వస్తున్నారు. మదనపల్లి రైల్వే స్టేషన్ దగ్గర తన హ్యాండ్ బ్యాగ్ ను పోగొట్టుకున్నాడు. దీంతో ధర్మవరం చేరుకోగా అక్కడి జిఆర్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న జి ఆర్ పి పోలీసులు విచారణ చేపట్టి, అనంతరం వారు మాట్లాడుతూ…

Read More

ఏపీలో విస్తారంగా వర్షాలు.. రెండు ద్రోణుల ప్రభావం

మరో ద్రోణి కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కన్యాకుమారి వరకు కొనసాగుతోందని వెల్లడిఆంధ్రప్రదేశ్‌పై రెండు ఉపరితల ద్రోణుల ప్రభావం కొనసాగుతోంది. వీటి ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు, రానున్న రెండు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతం ఒక ద్రోణి ఉత్తర కోస్తాంధ్ర తీరం నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు…

Read More

అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఏరువాక పున్నమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలని చంద్రబాబు పేర్కొన్నారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులు భూమిని, పశుసంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే విశిష్టమైన…

Read More

ఐర్లాండ్‌ మమ్మల్ని మించిపోయింది: శ్రేయస్ అయ్యర్‌

ఐర్లాండ్‌ చేతిలో టీ20 సిరీస్‌ను కోల్పోయిన తర్వాత భారత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్‌ను అర్థం చేసుకోవడంలో, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటంలో ప్రత్యర్థి జట్టు తమకంటే మెరుగ్గా వ్యవహరించిందని అంగీకరించాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఒక పరుగు తేడాతో ఓడిన భారత్‌.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో చేజార్చుకుంది. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన శ్రేయస్‌ అయ్యర్‌.. ప్రత్యర్థి ఆటతీరును ప్రశంసిస్తూ తమ జట్టు లోపాలను ప్రస్తావించాడు. ‘‘పిచ్‌ ఎలా ప్రవర్తిస్తుందో మేం…

Read More

సీఎం చంద్రబాబు జిల్లాల బాట.. 5 రోజుల షెడ్యూల్ ఖరారు

జులై 1 నుంచి 5వ తేదీ వరకు సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటననెల్లూరు జిల్లాలో పింఛన్ల పంపిణీతో పర్యటన ప్రారంభంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జులై 1వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాలలో పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతో పాటు, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ…

Read More