ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
విశాలాంధ్ర – పుట్టపర్తి: ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భూ వివాదాలు, పింఛన్లు, గృహాలు, తాగునీటి సౌకర్యం, రహదారులు, విద్యుత్ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సుమారు 26 వినతిపత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు.ప్రతి…


