శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా!

సినిమా: ఒక దర్శకుని వద్ద శిక్షణ పొందిన వారంతా విభిన్న కథలతో విజయాలు అందుకోవడం విశేషం. అగ్ర దర్శకుల్లో ఒకరైన సుకుమార్‌కు ఇది వర్తిస్తుంది. ఆయన వదిలిన కొత్త బాణం హుస్సేన్ షా కిరణ్ ‘మృత్యుంజయ’ తో హిట్ కొట్టడంతో టాలీవుడ్.. ‘శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా’ అంటోంది. సుకుమార్ శిష్య బృందంలో పల్నాటి సూర్య ప్రతాప్ ఒకరు. ‘కరెంట’తో దర్శకుడిగా పరిచయమైన తర్వాత సుకుమార్‌తో ప్రయాణించారు. ఆ క్రమంలో తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా ‘కుమారి 21…

Read More

పుతిన్‌కు ట్రంప్‌ ఫోన్‌ కాల్‌ – Visalaandhra

–పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం పై చర్చలు మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌లో చర్చలు జరిపినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ వెల్లడించింది. పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం పై ఇరువురి అగ్రనేతలు చర్చలు జరిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాలో నెలకొన్న అనిశ్చితి, యుద్ధ పరిస్థితుల గురించి ఇరువురు నేతలు దాదాపు గంటసేపు మాట్లాడుకున్నట్లు తెలిపింది. యుద్ధం…

Read More

లెబనాన్‌పై ఇజ్రాయిల్ వైట్ ఫాస్ఫరస్ ప్రయోగం

అంతర్జాతీయ మానవ హక్కుల సంఘంబీరుట్: ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు లెబనాన్‌పై కూడా దాడులకు పాల్పడుతోంది. ఈ రెండు దేశాల మధ్య కూడా దశాబ్దాలుగా వైరం నడుస్తోంది. వారం రోజుల నుంచి ఇరాన్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 400 మందికి పైగా లెబనాన్ ప్రజలు మరణించినట్లు ఆ దేశం ప్రకటించింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై కూడా దాడి చేసింది. ప్రజల నివాసాలపై కూడా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు…

Read More

ఇరాన్‌తో యుద్ధం ముగింపుపైసరైన సమయంలో నిర్ణయం

. ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ఇరాన్ కొత్త నాయకత్వంపై స్పందించేందుకు నిరాకరణ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం ముగింపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యలను ఎప్పుడు నిలిపివేయాలన్న నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటానని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం పూర్తిగా తనదే అయినప్పటికీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో చర్చించి పరస్పర అవగాహనతో తుది నిర్ణయం తీసుకుంటా మని స్పష్టం చేశారు. టైమ్స్ ఆఫ్ ఇజ్రా…

Read More

నిధులున్నా పనులు సున్నా!

. ముందుకు కదలని 66 పథకాలు. ఖాతాల్లో మూలుగుతున్న వేల కోట్ల కేంద్ర నిధులు. మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం. అధికారుల అసమర్థతతో కుంటుపడుతున్న ప్రగతి విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్రంలో అభివృద్ధికి నిధులు లేవంటూ సీఎం సైతం అనేక సభల్లో బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుంటారు… కానీ నిర్ణీత వ్యవధిలోగా కేంద్ర నిధులు వినియోగించుకోవాలన్న కనీస ఆలోచన ప్రభుత్వానికి తట్టకపోవడం బాధాకరం. రాష్ట్ర వాటాగా 40 శాతం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసినట్లయితే కేంద్ర ప్రాయోజిత పథకాల కింద…

Read More

మద్యం కేసులోఈడీ దూకుడు

. మద్యం కేసులో కీలక నిందితుల విచారణ. త్వరలో మరికొందరికి నోటీసులిచ్చే అవకాశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెప్పబడుతున్న ఈ భారీ కుంభకోణంలో వేల కోట్ల రూపాయల మేర అవినీతి, అక్రమాలు, కమీషన్ల పంపకాలు, మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక…

Read More

భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్

. వచ్చే డిసెంబరుకు భూ వివాదాలన్నీ పరిష్కారం. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పిస్తాం. ఉచితంగా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు. గత పాలనలో భూ అక్రమాలకు పాల్పడింది మంత్రుల ముఠాలే. నేడు అభివృద్ధి-సంక్షేమం. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – నంద్యాల : వచ్చే ఏడాది డిసెంబరు నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరించేలా ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నామని, భూ అక్రమాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కింద చర్యలు…

Read More

పశ్చిమాసియాపై చర్చించాల్సిందే – Visalaandhra

పట్టుపట్టిన విపక్షాలుఅవకాశం లేదంటూ మొండికేసిన ప్రభుత్వం పార్లమెంటు ఆవరణలో నిరసన న్యూదిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పార్లమెంటును కుదిపేశాయి. అధి కార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పశ్చిమాసి యా పరిణామాలపై తక్షణమే చర్చిం చాలని ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభలో డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం ఏమాత్రం ముందుకు రాలేదు. స్పీకర్ అవిశ్వాసంపై చర్చ చేపడదామని ప్రభుత్వం వాదించింది. పశ్చిమాసియా రగులుతోందని, అక్కడ కోట్లమంది భారతీయులు చిక్కుకున్నారని, వారి భద్రత అత్యంత అవసరమని ప్రతిపక్షాలు స్పష్టంచేశాయి. యుద్ధం…

Read More

ఇరాన్ అధినేత ముజ్తబా – Visalaandhra

. ఖామేనీ రెండో కుమారుడి ఎన్నిక. దేశవ్యాప్తంగా సంబరాలు. తెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు మరింత తీవ్రం. బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ప్ర తి దాడులు తెహ్రాన్: ఇజ్రాయిల్, అమెరికాతో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంది. అమెరికా హెచ్చరికలను భేఖాతరు చేస్తూ ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖామేనీని కొత్త నేతగా ప్రకటించింది. ఇరాన్‌లోని 88మంది మతగురువులతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స’ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు…

Read More

ఐపీఎస్ సునీల్‌కు చుక్కెదురు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం.సునీల్‌నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అర్హతపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ నెల 12 వరకు సునీల్ నాయక్ విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సునీల్ నాయక్ విచారణ సోమవారంతో ముగియనుండగా… దర్యాప్తు అధికారి విజ్ఞప్తి మేరకు విచారణను హైకోర్టు పొడిగించింది. అలాగే సునీల్ నాయక్ దాఖలు…

Read More