ఉష్ణోగ్రతలు చూస్తే.. తెలంగాణలో మాగ్జిమం 33 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మేఘాల కారణంగా ఇవాళ తెలంగాణలో ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గుతుంది. ఏపీలో మాత్రం 35 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ముఖ్యంగా రాయలసీమలోని కడప, నెల్లూరు. ప్రొద్దుటూరు, అనంతపురం, నంద్యాల, డోన్, గూడూరు, తిరుపతి, రాయచోటి, కదిరి, గుంతకల్ ఈ ప్రాంతాల్లో అత్యంత వేడి వాతావరణం ఉంటుంది. ఇక్కడి ప్రజలు ఈ రోజు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ తగలకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. తేమ ఏపీలో 37 శాతం, తెలంగాణలో 35 శాతం ఉంటుంది.



