ఆలయాల బంగారంపై కేంద్రం స్పష్టీకరణ.. వదంతులను నమ్మొద్దని సూచన
దేశంలోని ఆలయాలు, మత సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని నగదుగా మార్చే విధానంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేసింది. దేవాలయాల బంగారు నిల్వలను ప్రభుత్వానికి అప్పగించి వాటి స్థానంలో బంగారు పత్రాలు ఇవ్వబోతున్నారంటూ ఇటీవల సామాజిక మాధ్యమాలు, కొన్ని వార్తా వేదికల్లో ప్రచారం సాగుతోంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. దేవాలయాల ట్రస్టులు, మతపరమైన సంస్థల బంగారాన్ని వినియోగంలోకి తీసుకొచ్చే ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం తీసుకురాబోతుందన్న ప్రచారం…


