కాలువ కాదు…! రోడ్డే…!

విశాలాంధ్ర – కడియం : దేశవ్యాప్తంగా నర్సరీలకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా, కడియం మండలం, కడియపులంక పంచాయతీ పరిధిలోని, బుర్రిలంక గ్రామంలో శనివారం ఉదయం కురిసిన చిన్నపాటి వర్షానికే వీధులు వర్షపు నీరుతో నిండి కాలువలను తలపిస్తున్నాయి. గ్రామంలోని పాత వినాయకుడు గుడి వీధిలో పరిసరాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరింది. దీనితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికి వీధులు మునిగిపోవడంపై మండిపడుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని భద్రతను దృష్టిలో…

Read More

అక్కచెల్లెమ్మల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు: జగన్

స్మార్ట్ కిచెన్స్ పేరుతో వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారని మండిపాటుగవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85 వేల మంది అక్కచెల్లెమ్మల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. దాదాపు 20 ఏళ్లకు పైబడి పనిచేస్తున్నవారు, వీరిలో చాలామంది ఉన్నారని… ఇప్పుడు, స్మార్ట్‌ కిచెన్స్‌ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్కచెల్లెమ్మలను మాత్రం రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగా ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన…

Read More

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. ప్రమోషన్లు, బదిలీల ఫ్రీజింగ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.ఉద్యోగుల పదోన్నతులు, పోస్టుల అప్‌గ్రేడ్‌లు, బదిలీలపై అమలు చేయాలని నిర్ణయించిన ఫ్రీజింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసింది.జూన్ 25 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ నిబంధనను జులై 5 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది.ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉద్యోగ సంఘాల అభ్యర్థనకు ప్రభుత్వం సానుకూల స్పందన..రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలు ప్రక్రియలో భాగంగా సాధారణ పరిపాలన శాఖ…

Read More

వ్యాక్సిన్ తీసుకున్న కాసేపటికే యువతి మృతి!

నాసిక్‌లో వ్యాక్సినేషన్ కేంద్రం వెలుపల ఘటనఒకే వయల్ నుంచి వ్యాక్సిన్ తీసుకున్న మిగతా ఆరుగురు సురక్షితంమృతికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభంమహారాష్ట్రలోని నాసిక్‌లో విషాదం చోటుచేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో టెటనస్-డిఫ్తీరియా (టీడీ) బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే 17 ఏళ్ల శ్రావణి పాటిల్ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. అధికారులు వెంటనే స్పందించి ముందు జాగ్రత్తగా సదరు వ్యాక్సిన్ బ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. జూన్ 25న…

Read More

నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ మృతి

చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ (73) కన్నుమూశారు. గుండెపోటుతో శనివారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 75 సినిమాల్లో నటించిన భాగ్యరాజ్, 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. భాగ్యరాజ్ పూర్తిపేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో తమిళనాడులో జన్మించిన ఆయన దర్శకులు జి.రామకృష్ణన్, భారతీరాజాల దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. భారతీరాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. 1979లో ‘సువరిల్లద చిత్తిరంగల’ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. నటి…

Read More

జాతీయత గుర్తించే ఆధారమేంటి?: శశిథరూర్ – Visalaandhra

న్యూదిల్లీ: పాస్‌పోర్టు, ఆధార్ జాతీయతను తెలిపేవిగా పరిగణించకపోతే పౌరసత్వ గుర్తింపునకు మరి వేటిని ఆధారంగా తీసుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాస్‌పోర్టును పౌరసత్వం నిర్థారించే పత్రంగా పరిగణించడం లేదని, అది కేవలం విదేశీ ప్రయాణ అనుమతి పత్రమేనంటూ కేంద్రం స్పష్టం చేయడంపై కాంగ్రెస్ ఆయన స్పందించారు. పాస్‌పోర్ట్, ఆధార్‌లను ప్రభుత్వం ఉపసంహరించుకోనంత వరకు వాటిని పౌరసత్వాన్ని తెలిపే ఆధారాలుగా పరిగణించాలన్నారు. అందుకు వీలుగా చట్ట సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఆధార్ ప్రక్రియలో…

Read More

నేడు భారీ వర్షాలు

మొదటివారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ? విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం నుండి మధ్య మహారాష్ట్ర వరకు తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపైన్ను ఉపరితల ఆవర్తనం మీదుగా ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దీని ప్రభావంతో ఈనెల 27, 28 తేదీల్లో కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈదురుగాలులు కూడా వీచే…

Read More

యువశక్తే దేశానికి పెట్టుబడి – Visalaandhra

వారిని డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకుందాం గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన అందరి లక్ష్యం అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ సభలో హోంమంత్రి అనిత విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : దేశంలో అత్యంత శక్తివంతమైన మానవ వనరులైన యువశక్తి భగ్నం కాకుండా, రాబోయే తరాల అభివృద్ధికి వారిని ఒక పెట్టుబడిగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మినిస్రీట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్,…

Read More

రామమందిర నిధుల కుంభకోణంపైన్యాయవిచారణ – Visalaandhra

సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండ్ న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి. రాజా డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేవలం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణతో సరిపెట్టకూడదని, పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే వరకు విచారణ కొనసాగించాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన…

Read More

పవన్ శాఖలు అవినీతిమయం! – Visalaandhra

పంచాయతీల నిధులు గోల్మాల్ కాకినాడ జిల్లాలోనే రూ.1.91 కోట్ల అక్రమాలు నకిలీ ఇంధన బిల్లులతో ప్రజాధనం స్వాహా అటవీ, పర్యావరణ శాఖల్లోనూ ఉల్లంఘనలు మడ అడవులు నరికేసి…రొయ్యల చెరువుల తవ్వకం భారీగా మట్టి, గ్రావెల్ తవ్వకాలు… పర్యావరణానికి ముప్పు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సొంత శాఖల్లో అవినీతి ఆరోపణలు గుపðమంటున్నాయి. ఒక వైపు ోం శాఖ తన చేతుల్లో లేనందున బతికిపోయారంటూ ఇటీవల కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ ఆరోపణలకు…

Read More