కరెన్సీనోట్లను తరలిస్తుండగా కూలిన విమానం.. 15 మంది దుర్మరణం
బొలీవియా(Bolivia) రాజధాని లా పాజ్(La Paz) సమీపంలో ఎల్ ఆల్టో(El Alto) నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. బొలీవియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం(Hercules aircraft) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 15మంది మరణించగా.. 30మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. విమానం బొలీవియా సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్త నోట్లను తీసుకుని వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటనా…


