భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గిపోవడం ఖరీదైన లోహాలపై ఒత్తిడిని తగ్గించింది. అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాల పాటు యుద్ధ విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. దీనితో బంగారం, వెండి అనూహ్యంగా పుంజుకున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.3,650 పెరగగా, కిలో వెండి రూ.10 వేలకు పైగా పెరిగింది.హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం నిన్నటితో పోలిస్తే రూ.1,53,800కు, 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.2,999 పెరిగి రూ.1,41,000కు…

Read More

ఇరాన్‌ను వెంటనే వీడండి

: భారతీయులకు కేంద్రం మరోసారి కీలక అడ్వైజరీ ఇరాన్ దేశంలోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశం నుంచి వెంటనే బయటపడాలని భారత పౌరులకు సూచించింది. ఈ మేరకు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా పోస్టును పంచుకుంది. కేంద్ర ప్రభుత్వం సూచనల ఆధారంగా ఇరాన్ నుంచి బయటపడాలని కోరింది.ఇరాన్‌లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించకుండా లేదా వారితో సమన్వయం చేసుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోకి రావొద్దని హెచ్చరించింది. ఈ…

Read More

వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ గవర్నర్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేటును మార్చడం లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనూహ్య సవాళ్లు ఎదురవుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చమురు…

Read More

ఎన్నికల బరిలో సంపన్నురాలు లీమారోస్ – Visalaandhra

లాల్గుడి అన్నాడీఎంకే అభ్యర్ధి కుటుంబ ఆస్తుల విలువ రూ.ఆరు వేల కోట్లు ఆర్కేనగర్ (చెన్నై): రాజకీయాలు చాలా ప్రియం అవుతున్నాయి. సామాన్యులు అందుకోలేనంత స్థాయికి చేరాయి. దేశంలోని రాజకీయ పార్టీలు ధనవంతులవైపే మొగ్గు చూపుతున్నాయి. బయటకి చెప్పకపోయినా నీ ఆస్థి ఎంత, నీవెంత ఖర్చు చేయగలవు అనే అంటున్నాయి దాదాపు అన్ని పార్టీలు… ఒక్క వామపక్ష పార్టీలు తప్పా. అందుకు తగ్గట్టుగానే కార్పొరేట్‌లు, సంపన్నులే రాజకీయాల్లోకి వస్తున్నారు. తాజాగా తమిళనాడులోని తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి…

Read More

యుద్ధానికి ముగింపు కాదు: మొజ్తాబా ఖామేనీ

తెహ్రాన్: అమెరికా- ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీం మొజ్తాబా కీలక ప్రకటన చేశారు. ఈ కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదని స్పష్టంచేశారు. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం మొజ్తాబా విడుదల చేసిన ప్రకటనను ఆ దేశ మీడియా వెళ్లడించింది. ‘ఇది యుద్ధం ముగింపునకు సంకేతం కాదు. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. శత్రుదేశాలు ఏవిధంగానైనా దురాక్రమణకు పాల్పడితే… పూర్తి బలంతో ధీటుగా స్పందిస్తాం’…

Read More

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

-సీపీఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి విశాలాంధ్ర-తిరుపతి: తిరుపతి నగరంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే ఏఐటీయూసీ మహాసభలు జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. తిరుపతి నగరం బైరాగిపట్టెడలో గల గంధమనేని శివయ్యభ భవన్ లో మంగళవారం సీపీఐ కార్యవర్గ సభ్యులు , ఏఐటియుసి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం చిన్నయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా…

Read More

పాడి రైతుకు కష్టకాలం

*పతనమవుతున్న ధరలు*పెరుగుతున్న పెట్టుబడి*పశువులకు మేత కొరత (విశాలాంధ్ర- చిత్తూరు) చిత్తూరు జిల్లా అంటేనే పాడి పరిశ్రమకు పట్టుగొమ్మ. రాష్ట్రంలోనే పాల ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉన్న ఈ జిల్లాలో లక్షలాది కుటుంబాలకు పశువులే జీవనాధారం. వ్యవసాయం కలిసిరాక, వర్షాభావ పరిస్థితులతో విసిగిపోయిన సామాన్య రైతుకు ‘పాడి’ ఒక ఆశాకిరణంగా నిలిచింది. కానీ, నేడు అదే పాడి పరిశ్రమ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, పాలకుల ఉదాసీనత మరోవైపు వెరసి.. పాడి రైతు బతుకు భారంగా మారింది….

Read More

జర్నలిస్ట్ లకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్

తిరుపతి పట్టణ పరిధిలోని పాత్రికేయులు సద్వినియోగం చేసుకోగలరు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, ఏప్రిల్ 06: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో తిరుపతి పట్టణ పరిధిలో అక్రెడిటేషన్ కలిగిన పాత్రికేయులకు ఈ నెల 07 నుండి 10 వరకు అమరా ఆసుపత్రి, కరకంబాడి వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ ల ఆరోగ్య భద్రతకు పెద్ద పేట వేస్తున్నదని, ఇందులో…

Read More

చొరబాటుదారుల పేరుతో బీజేపీ రాజకీయాలు – Visalaandhra

ఇంత వరకు వారిని ఎందుకు పంపలేకపోయారు: ఖడ్గే సిల్చర్ (అసోం): రాష్ట్రంలో చొరబాటుదారుల పేరు చెప్పి బీజేపీ కాలయాపన చేసి రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే విమర్శించారు. పదేళ్లకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రం నుంచి చొరబాటుదారులను బీజేపీ చొరబాటుదారులను ఎందుకు వెనక్కి పంపలేకపోయిందని ప్రశ్నించారు. బీజేపీ, కేంద్రమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కచార్ జిల్లాలోని బోర్ఖోలాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘అసోంకు…

Read More

మాజీ ‘మిస్ ఇండియా ఎర్త’ అదృశ్యం

పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు పూణె: మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సయాలీ సర్వే, ఆమె నలుగురు పిల్లలు అదృశ్యమయ్యారు. పుణెలోని పింప్రి-చించ్వాడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఆమె ఇస్తాంలోకి మారారు. ఇటీవలే తిరిగి హిందూమతంలోకి మారారు. హిందూమతంలోకి మారిన కొన్ని రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. భర్త, అత్తింటివారే సయాలీని కిడ్నాప్ చేశారంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి…

Read More