‘పెద్ది’ సినిమాలోకి మరో నాయిక?

హైదరాబాద్: రామ్‌చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో ఓ ప్రత్యేక గీతాన్ని త్వరలోనే తెరకెక్కించ నున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే రామ్ చరణ్‌తో కలిసి ఆ పాటకు డ్యాన్స్ చేసే కథానాయకను ఎంపిక చేయడంపై చిత్ర బందం దష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు కథానాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా… తెలంగాణ తెలుగమ్మాయి మానస వారణాసి కూడా ఈ రేసులోకి వచ్చింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో ఆకట్టుకున్నారు మానస…

Read More

హోర్ముజ్ జల సంధి పై గందరగోళం

తెహ్రాన్ : ఇరాన్- అమెరికా రెండు వారాల కాల్పుల విరమణ కు అంగీకరించిన సంగతి తెలిసిందే. దీనితో తాత్కాలికంగా యుద్ధం ముగిసినట్లు కనిపించింది. అయితే లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. అమెరికా ఒప్పందం షరతులకు లోబడి హోర్మోజ్ ను తెరిచిన తెహ్రాన్… లెబనాన్ లో దాడులకు ప్రతిగా ఆ జలసంధిని తిరిగి మూసేసింది. ‘ సముద్ర భద్రత సూత్రాలకు అనుగుణంగా సీమైన్స్ నుంచి రక్షణ కోసం హోర్మోజ్ జల సంధి…

Read More

ప్రపంచ శాంతికి ఇది గొప్ప దినం

డొనాల్డ్ ట్రంప్వాషింగ్టన్: ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన అమెరకా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా ఈ పరిణామాన్ని ప్రపంచ శాంతికి అతిపెద్ద రోజుగా అభివర్ణించారు. ఇరాన్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతోంది. ఇది జరగాలని ఇరాన్ కోరుకుంటోంది. వారికి ఇక చాలు అనిపించింది. అలాగే, ప్రపంచం మొత్తం కూడా యుద్ధం ఆగిపోవాలనే కోరుకుంటోంది. హోర్మూజ్ జలసంధిలో…

Read More

ఆహార భద్రత డొల్ల! – Visalaandhra

. ప్రజల ప్రాణాలతో కల్తీరాయుళ్ల చెలగాటం. మామూళ్ల మత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు. 28వ స్థానానికి దిగజారిన ఏపీ ర్యాంకింగ్. ఎఫఎసఓలు, ఏఎఫ్‌సీలు విజిటింగ్‌లకే పరిమితం. 30 శాతం లైసెన్సులు లేకుండానే వ్యాపారం విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలో ఆహార భద్రత వ్యవస్థ అపహాస్యమవుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీరాయుళ్లను కట్టడి చేయాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి ఆహార కేంద్రాల్లో నాణ్యతలేని పదార్థాల వాడకం విచ్చలవిడిగా పెరుగుతుంటే, ఫుడ్ సేఫ్టీ అధికారులు…

Read More

అసెంబ్లీ పోరుకుసర్వం సిద్ధం

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తున్న అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. గురువారం రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అసోం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ప్రజలు తమ తీర్పును ఇవ్వనున్నారు. మూడు ప్రాంతాల్లో కలిపి 6.1 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఒక అగ్నిపరీక్షగా మారనున్నాయి. తమిళనాడు, పశ్చిమ…

Read More

లూలుకు భూకేటాయింపుపైవెనక్కి తగ్గిన ప్రభుత్వం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: విజయవాడలో లూలు గ్రూపుకు భూముల కేటాయింపుపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలోని ఆర్‌టీసీ స్థలాన్ని లూలు మాల్‌కు కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో లూలు మాల్‌కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్‌పేట ఆర్‌టీసీ డిపోకు…

Read More

అమరావతికి మరో కీలక ప్రాజెక్టు – Visalaandhra

కేంద్ర కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణంరూ.2,534 కోట్లతో కార్యాలయాలు, నివాస భవనాలు22.53 ఎకరాలు కేటాయించిన సీఆర్‌డీఏ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణం చేపడుతున్న తరహాలోనే… అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాటిలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.2,534 కోట్లతో చేపట్టనున్న ఈ నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్‌ను…

Read More

ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం

. పోర్టు కారిడార్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు. గోదావరి పుష్కరాల్లోపే రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు పూర్తి. ఈవీ బస్సుల వినియోగం పెంచుదాం. సీఎం చంద్రబాబు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం రహదారులు,…

Read More

తోక ముడిచిన ట్రంప్ – Visalaandhra

ఇరాన్‌పై రెండు వారాలు సైనిక చర్య నిలిపివేసినట్లు ప్రకటన . ఈ లోగా ఒప్పందం చేసుకుంటామని వెల్లడి. పది షరతులతో కాల్పుల విరమణకు అంగీకరించిన తెహ్రాన్. దురాక్రమణకు పాల్పడితే దీటుగా స్పందిస్తామని హెచ్చరిక. రేపు ఇస్లామాబాద్‌లో చర్చలకు ఇరుదేశాలకు పాక్ ఆహ్వానం తెహ్రాన్/వాషింగ్టన్: ఒక్క రాత్రిలో ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తామని ప్రగల్బాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఇరాన్ చూపిన తెగువకు తల వంచారు. ీVAర్మోజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ఇచ్చిన నలభై ఎనిమిది గంటల గడువు మరో…

Read More

నేటి నుంచి దుకాణాల వేలం

అందుబాటులో 36 కాలనీల్లో 1400 షాపులు విశాలాంధ్ర – హైదరాబాద్: భాగ్యనగరంలోని క్యూర్ పరిధిలో డబుల్ బెడ్ రూం కాలనీల్లో ఉన్న 1400కు పైగా దుకాణాలను బహిరంగ వేల ద్వారా విక్రయించే ప్రక్రియ గురువారం నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 36 కాలనీల్లో ఉన్న దుకాణాలను వేలం ద్వారా విక్రయించడానికి ఆయా జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీచేశారు. తొలుత రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎనిమిది కాలనీల్లో…

Read More