ఏపీలో నేటి నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియకు ఇంటర్ విద్యా మండలి సర్వం సిద్ధం చేసింది. ఈరోజు నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుండగా, ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. మార్చి 25తో పరీక్షలు పూర్తిగా ముగియనున్న నేపథ్యంలో, ఫలితాలను త్వరితగతిన ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రంజిత్ బాషా వివరించారు. ఇప్పటికే ప్రధాన పరీక్షలు…


