మొదటి రోజైన ఏప్రిల్ 24 రాత్రి నుండి ఏప్రిల్ 25 ఉదయం వరకు రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం నెలకొంటుంది. ప్రధానంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అయితే, మరోవైపు రాబోయే మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా 1 నుండి 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.



