మళ్లీ లాక్డౌన్పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధిస్తారంటూ సోషల్ మీడియా సహా, కొన్ని వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. దేశంలో లాక్డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించే లక్ష్యంతో ఆయన ఈ స్పష్టతనిచ్చారు. భారత్లో లాక్డౌన్ విధిస్తారనే వదంతులు పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ పరిశీలనలో అలాంటి ప్రతిపాదన…


