గోదావరిజిల్లాలు అంటేనే పాడిపంటలకు ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు. అటువంటి ప్రాంతంలో ఈఏడాది మామిడి పండ్లు అరకోరగా ఇప్పటివరకు మార్కెట్లో దర్శనమిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కానీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి జాతీయ రహదారి మొదలుకుని,ఎర్రకోనేరు వరకు మామిడి పండ్లు గబాలిస్తూ కనిపిస్తాయి. ఒకటికాదు రెండుకాదు అనేక రకాల జాతి మామిడిపండ్లు ఈ రహదారిపై ఆకట్టుకుంటూ ఉంటాయి.ముఖ్యంగా ఆరహదారిపై ప్రయాణం చేసామా, వాటి సువాసన అద్భుతం అనే విధంగా అక్కడ భక్తులను ప్రయాణికులను సైతం ఆకట్టుకుంటాయని చెప్పుకోవచ్చు.
Source link


