అవినీతి ఊబిలో రెవెన్యూ
. పనికావాలంటే పైసలివ్వాల్సిందే. 22-ఏ పేరుతో అక్రమ దందా. తారుమారవుతున్న భూ రికార్డులు. రాజకీయ నాయకులతో అధికారుల కుమ్మక్కు విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలు అక్రమాలకు అక్షయపాత్రలా తయారయ్యాయి. సామాన్యుడి పట్టా భూమిని రాత్రికి రాత్రే పరాధీనం చేసే మాయా లోకాన్ని తలపిస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయంలోకి అడుగు పెట్టాలంటే జేబులో నోట్ల కట్టలు ఉండాలి. లేదంటే రాజకీయ అండ ఉండాలి. అక్కడ చట్టం కంటే రాజకీయ నాయకుడి మాటే శాసనం. నిబంధనల కంటే నోట్ల కట్టలకే విలువ…


