పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం.. లయన్స్ క్లబ్

విశాలాంధ్ర ధర్మవరం; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు రమేష్ బాబు, కార్యదర్శి నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉచిత కంటి శాస్త్ర చికిత్స శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతగా కీర్తిశేషులు బండి ఆంజనేయులు వారి జ్ఞాపకార్థం కుమారుడు బండి వేణుగోపాల్ వ్యవహరించడం జరిగిందన్నారు. మొత్తం 65 మంది కంటి రోగులు పాల్గొనగా…

Read More

సైకిల్ రేస్ పోటీలో జడ్పీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ హెడ్మాస్టర్ సుమనవిశాలాంధ్ర ధర్మవరం:: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారు ఇటీవల నిర్వహించినటువంటి సైకిల్ రేసులో జిల్లా స్థాయికి పట్టణంలోని జడ్పీ హైస్కూల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు రాణించి, రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ సుమనా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు గాను ఫిబ్రవరి 28 నుండి మార్చి ఒకటి వరకు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తారని…

Read More

పిఎసిఎస్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు పయ్యావుల సోదరులకు కృతజ్ఞతలు

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పిఎసిఎస్( ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ) చైర్మన్ పదవి కల్పించినందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు మరియు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులకు నూతన చైర్మన్ గా ఎన్నికైన ప్యారం కేశవానంద హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులును కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్యారం కేశవానంద మాట్లాడుతూ,…

Read More

న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది – Visalaandhra

: NCERT వివాదాస్పద బుక్‌ను నిషేధించిన సుప్రీం న్యాయవ్యవస్థపై ఎన్‌సీఈఆర్‌టీ ‘కుట్రే‘ సుప్రీంకోర్టు సంచలన తీర్పు! బేషరతుగా క్షమాపణలు చెప్పిన కేంద్రంఅవినీతి పాఠ్యాంశంపై కఠిన చర్యలు.. మార్చి 11న తదుపరి విచారణకు ఆదేశం జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడం వివాదం అవుతోంది. ఈ అంశాన్ని సుమోటోగా పరిగణించిన సుప్రీంకోర్టు.. గురువారం విచారణను ప్రారంభించింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను మంటగలిపేలా…

Read More

ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్..ఆస్తి పన్ను చెల్లింపుల కోసం సరికొత్త విధానం

ఏపీలో పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చెల్లింపులు, ఇతర పురపాలక సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ, వాణిజ్య భవనానికీ ఒక ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానం ద్వారా ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్…

Read More

విధ్వంసకులతో మోదీ వియ్యం – Visalaandhra

అత్యంత అననుకూలమైన పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి మోదీ రెండు రోజుల పర్యటనకోసం బుధవారం ఇస్రాయెల్ పర్యటన ప్రారంభించారు. భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం అంతర్జాతీయ రంగంలో మోదీ పలుకుబడిని బాగా దెబ్బ తీసింది. సన్నిహిత మిత్రుడు అనుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోదీని ఖాతరు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ మధ్యవర్తిత్వంతో ట్రంప్‌కు దగ్గర కావాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. ఏ దేశ విదేశాంగ విధానమైనా తమ ప్రయోజనాల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ సంబంధాలు…

Read More

భారత్`పాక్ అణు యుద్ధం నివారించా – Visalaandhra

. నా జోక్యం లేకుంటే 3.5 కోట్ల మంది ప్రాణాలు పోయేవి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటన వాషింగ్టన్: అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పది నెలల కాలంలోనే తాను ఎన్నో గొప్ప పనులు చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గొప్పలు పోయారు. ఏకంగా 8 యుద్ధాలను ఆపానని పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ ‘స్టేట్ ఆఫ్ యూనియన’ ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఆపిన యుద్ధాలలో భారత్, పాక్…

Read More

సమస్యలపై సమరమే – Visalaandhra

. ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటాం. స్పష్టమైన ప్రకటన చేయకపోతే అసెంబ్లీ ముట్టడి. ఉపాధ్యాయుల నినాదాలతో దద్దరల్లిన ధర్నాచౌక్. డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధతం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య హెచ్చరిక విశాలాంధ్ర-విజయవాడ:తమ సమస్యలపై సానుకూల ప్రకటన రాకపోతే ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని ఉపాధ్యాయులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నా పాýకుల నుండి ఎటువంటి ప్రకటనలు రాకపోవడంపై మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలపై మౌనం వీడి… స్పష్టమైన…

Read More

మరోసారి భారత్‌ పై ట్రంప్‌ టార్గెట్

-సోలార్ ఉత్పత్తులపై 126 శాతం డ్యూటీ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను టార్గెట్ చేశారు. మన దగ్గరి నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 126 శాతం డ్యూటీ విధించారు. ఇండోనేసియాపై ప్రాథమిక సుంకాలను 86 శాతం నుంచి 143 శాతానికి పెంచారు. లావోస్‌పై 81 శాతం డ్యూటీ వేశారు. ఫారెన్‌ సబ్సిడీల ఆధారంగా రేటును నిర్ధరించినట్లు అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. ఈ మూడు దేశాల నుంచి అగ్రరాజ్యానికి…

Read More

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు.. కేంద్రాల వద్ద సందడి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు. దీంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను ఆయా కళాశాలల సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. Source link

Read More