బడ్జెట్ చూస్తే తిరువన్నామలై వరకు రైలు ప్రయాణానికి రూ.500, తిరువన్నామలైలో ఆటోకి రూ.300, వసతికి రూ.500, తిరువన్నామలై నుంచి తిరుపతికి రావడానికి రూ.300, తిరుపతి నుంచి తిరుమల వెళ్లి రావడానికి రూ.300, తిరుపతి నుంచి మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి రూ.400 ఖర్చవుతుంది. మూడు రోజులు భోజనం, ఇతర చిన్నచిన్న ఖర్చులకు మిగతా రూ.700 ఖర్చు పెట్టినా కేవలం రూ.3,000 బడ్జెట్లో అరుణాచలం, తిరుపతి యాత్ర పూర్తి చేయొచ్చు. అయితే ప్రతీ చోటా అకామడేషన్ కావాలనుకుంటే మాత్రం కాస్త బడ్జెట్ పెరుగుతుంది. అకామడేషన్ బదులు లాకర్స్, డార్మిటరీలు ఉపయోగించడం, బయట భోజనానికి బదులు ఆలయాల్లో అన్నప్రసాదానికి వెళ్తేనే తక్కువ బడ్జెట్లో యాత్ర పూర్తి చేయొచ్చు. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ యాత్రను సజావుగా చేయాలంటే ముందస్తు ట్రైన్ టికెట్లు ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. రద్దీ రోజుల్లో అయితే కాస్త ఖర్చు ఎక్కువవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)



