ఎన్నికల తర్వాత బెంగాల్‌లో హింస.. ముగ్గురి మృతి, భద్రతా సిబ్బందికి గాయాలు


పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత కూడా హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. నార్త్ 24 పరగణాస్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. రాత్రివేళ సున్నిత ప్రాంతాల్లో పహారా కాస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో పాటు బాంబులు విసిరినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక సోమవారం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటివరకు కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కోల్‌కతాలోని బెలేఘాటాలో మే 4 రాత్రి టీఎంసీ కార్యకర్త విశ్వజిత్ పట్నాయక్ హత్యకు గురైన ఘటన మొదటిగా నమోదైంది.

అనంతరం బిర్భూమ్ జిల్లా నానూర్‌లో అభీర్ షేక్‌ను గొడవలో నరికి చంపారు. అలాగే హౌరాలో బీజేపీ కార్యకర్త జడబ్ బార్‌పై ఇనుప రాడ్లతో దాడి చేసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. పార్టీ విజయోత్సవాల నుంచి ఇంటికి వచ్చిన అతడిని మళ్లీ బయటకు పిలిచి దాడి చేసినట్లు స్థానిక బీజేపీ నేతలు తెలిపారు. తీవ్రంగా గాయపడిన బార్‌ను ఆస్పత్రికి తరలించగా, అక్కడ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తీవ్రంగా స్పందించి వెంటనే అరెస్టులు చేయాలని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో నిరంతర పహారా కొనసాగించాలని, శాంతిభద్రతలను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *