Last Updated:
Top 10 News: మే 2వ తేదీన టాప్ వార్తలేంటి? తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. దేశంలో ముఖ్యమైన వార్తలు? అలాగే అంతర్జాతీయంగా ముఖ్యమైన వార్తలు ఏమిటి? న్యూస్18 తెలుగు అందిస్తున్న టాప్ 10 వార్తలు మీకోసమే.
1. ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును బోర్డు ఈ నెల 4వ తేదీ వరకు పొడిగించింది. విద్యార్థులు 3,000 రూపాయల ఆలస్య రుసుముతో ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఫీజు కట్టవచ్చు. ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఫెయిల్ అయిన వారికి కూడా ఈ అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ రక్షణ సేన ద్వారా కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తన తండ్రి కేసీఆర్తో కుటుంబపరంగా ఎలాంటి గొడవలు లేవని ఆమె స్పష్టం చేశారు. అయితే రాజకీయ సిద్ధాంతాల పరంగా మాత్రం ఆయనతో విభేదిస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసమే తాను రాజకీయంగా విమర్శలు చేస్తున్నానని ఆమె వెల్లడించారు.
శంషాబాద్ ఓఆర్ఆర్ ప్రమాదంలో మరణించిన సిరిసిల్ల వాసులకు కేటీఆర్ నివాళులర్పించారు. మృతదేహాలను తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఒకే కుటుంబంలో ఆరుగురు చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన చెందారు.
ఏపీ, తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే వర్షాలు పడినా ఎండల తీవ్రత మాత్రం తగ్గదని స్పష్టం చేసింది. ప్రజలు వడగాల్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు.
భారీ రెమ్యునరేషన్లు, ఆర్థిక నష్టాల వల్ల తమిళ చిత్ర నిర్మాతలు నేడు సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సినిమాల షూటింగ్లు ఆగిపోయాయి. నటులు జీతానికి బదులు సినిమా లాభాల్లో వాటా తీసుకోవాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే నిరవధిక సమ్మె చేస్తామని వారు హెచ్చరించారు.
ఇరాన్ యుద్ధ ప్రభావంతో అమెరికాకు చెందిన ‘స్పిరిట్’ ఎయిర్లైన్స్ మూతపడింది. ఇంధన ధరల పెరుగుదల వల్ల ఈ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ప్రభుత్వ మద్దతు లభించకపోవడంతో కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. ఈ యుద్ధం వల్ల మూతపడిన మొదటి విమానయాన సంస్థగా ఇది నిలిచింది.
ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ వంటి దేశాలకు అమెరికా భారీగా ఆయుధాలను అమ్ముతోంది. సుమారు 81 వేల కోట్ల రూపాయల విలువైన సైనిక పరికరాల విక్రయానికి ఆమోదం తెలిపింది. కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నా రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. మిత్రదేశాల భద్రతే లక్ష్యంగా అమెరికా ఈ అడుగు వేసింది.
అమెరికా, ఇజ్రాయెల్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందని ఇరాన్ సైనికాధికారి హెచ్చరించారు. శత్రువులను ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. అమెరికా తమ ఒప్పందాలను సరిగ్గా పాటించడం లేదని ఆరోపించారు. శాంతి చర్చల్లో అనిశ్చితి వల్ల యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని ఆయన ఆందోళన చెందారు.
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల రిసెప్షన్ హైదరాబాద్లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి, నాగార్జున వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. గత నెల 29న వీరి వివాహం తిరుమలలో సింపుల్గా జరిగిన సంగతి తెలిసిందే.
సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణ తగ్గిపోయిందని దర్శకుడు రవిబాబు విమర్శించారు. కొందరు బాధ్యత లేకుండా సినిమాలు తీస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం సినిమాల నిర్మాణం ప్లానింగ్ లేకుండా సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీశాయి.
Hyderabad,Telangana



