Road Accident: ఉపాధి హామీ కూలీలను ఢీకొట్టిన టిప్పర్.. నలుగురు మృతి | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుల వివరాలు సేకరిస్తున్నారు. అలాగే.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నారు. ఇలా ఉపాధి హామీ కూలీలు.. ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ప్రభుత్వమే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News18
News18

ఉపాధి హామీ కూలీలను టిప్పర్ ఢీకొట్టడంతో.. నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్.. కాకినాడలోని.. కొవ్వూరు బ్రిడ్జి దగ్గర జరిగింది. తెల్లవారు జామున.. ఉపాధి హామీ పనుల కోసం కూలీలు వెళ్తుండగా.. వారిని వేగంగా వచ్చి టిప్పర్ ఢీకొట్టినట్లు తెలిసింది.

స్థానికులు.. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు. ఐతే.. వారి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో స్థానికంగా ఆందోళన ఉంది.

కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుల వివరాలు సేకరిస్తున్నారు. అలాగే.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నారు. ఇలా ఉపాధి హామీ కూలీలు.. ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ప్రభుత్వమే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్‌సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్‌డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్‌డేట్‌లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *