హొర్మూజ్ జలసంధిలో టెన్షన్.. చిక్కుకున్న 34 మంది భారత నావికులు!
ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ మేఘాలు భారత నావికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముంబైకి చెందిన కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ, మరో 33 మంది సిబ్బందితో కలిసి మార్చి 2 నుంచి హొర్మూజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయారు. 36 లక్షల గ్యాస్ సిలిండర్లకు సమానమైన భారీ ఎల్పీజీ లోడుతో ఉన్న ఈ ట్యాంకర్, ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం యూఏఈలోని మినా సకర్ పోర్టు వద్ద నిలిచిపోయింది.అక్కడి భయానక పరిస్థితులను కెప్టెన్ వీరేంద్ర స్వయంగా వివరించారు. “మేము రోజూ…


