బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత…
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా):- మండల పరిధిలోని కేశేపల్లి గ్రామం సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద రోడ్డుపై లక్ష్మీనరసింహులు అనే విద్యార్థికి మార్చి 31 న డబ్బులు దొరికాయి.వీటిని విద్యార్థి ఉపాధ్యాయుడు శాంత్ ప్రకాష్ రెడ్డికి అందజేశారు. సమస్యను నార్పల ఎస్సై సాగర్ దృష్టికి తీసుకెళ్లడంతో, పోలీసులు పూర్తి విచారణ నిర్వహించారు. బాధితుడు జుల కాల్వ గ్రామానికి చెందిన రవీంద్రకు గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై చేతుల మీదుగా 49000 రూపాయలు అప్పగించారు. నిజాయితీతో…


