ITI Admissions: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు గడువు ఎప్పుడంటే.. పూర్తి వివరాలు ఇవే | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

ITI Admissions: చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2026-27 ప్రవేశాల ఆన్‌లైన్ దరఖాస్తులు మే 19 నుంచి జూన్ 30 వరకు, సర్టిఫికెట్ ధృవీకరణకు సమీప ఐటీఐలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు

News18
News18

చిత్తూరు జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ (ITI) సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి దశ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ ఎం. రవీంద్ర రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు లోకల్ 18 ద్వారా ఆయన అధికారిక వివరాలను తెలియజేశారు.

ఐటీఐలో చేరాలని ఆసక్తి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. అభ్యర్థులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ iti.ap.gov.in ద్వారా తమకు నచ్చిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఐటీఐ కళాశాలలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మే 19, 2026 నుంచి ప్రారంభమై జూన్ 30, 2026 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. గడువు తేదీ తర్వాత ఎలాంటి దరఖాస్తులను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు తదుపరి దశలో సర్టిఫికెట్ల ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికోసం అభ్యర్థులు తమకు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు వెళ్లి ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలనకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్హతలు, కుల ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రాలు తదితర అవసరమైన పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.

అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేని విద్యార్థులు నేరుగా చిత్తూరు ప్రభుత్వ ఐటీఐకి వచ్చి అక్కడి సిబ్బంది సహాయంతో తమ దరఖాస్తులను నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

అలాగే ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారికి పరిశ్రమల్లో, సాంకేతిక రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అధికారులు తెలిపారు. తక్కువ కాలంలోనే సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకుని స్వయం ఉపాధి అవకాశాలను కూడా పొందవచ్చని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు మరిన్ని వివరాల కోసం 6302634177, 9440738121, 9182590869 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *