CM Chandrababu: సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ అందించారు. తాజాగా కీలక ప్రకటన చేశారు. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

CM Chandrababu: సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం..
CM Chandrababu: సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక చారిత్రాత్మక విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఇంటి వద్దకే అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘సంజీవని’ (Sanjeevani) పథకం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త హెల్త్ రికార్డులను సృష్టించబోతోంది. పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం కండ్రిగ గ్రామంలో నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్క పౌరుడికి నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తేవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

రామాయణంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటానికి హనుమంతుడు తెచ్చిన సంజీవని మూలికను స్ఫూర్తిగా తీసుకుని ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఆ పేరు పెట్టింది. ధనం ఉన్నవారి కంటే ఆరోగ్యం ఉన్నవారే అత్యంత అదృష్టవంతులని, అందుకే పెద్దలు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. సమాజం పురోగమించాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వ్యాధులను ముందుగానే గుర్తించే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యురేటివ్ హెల్త్‌కేర్ నమూనాల ఆధారంగా దీనిని రూపొందించారు.

ఇది కూడా చదవండి: Long Range Electric Bike: ఒక్కసారి చార్జింగ్ పెడితే 500 కిమి వెళ్లే ఎలక్ట్రిక్ బైక్.. రూ.3 వేల కన్నా తక్కువ ఈఎంఐ!

ఈ సంజీవని ప్రాజెక్టును మొదటగా కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి.. ఆ తర్వాత మార్చి 15 నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించారు. ఈ జిల్లాలో దాదాపు 19.75 లక్షల మంది ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ సాధించిన విజయాల ఆధారంగా.. రాబోయే ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ సంజీవని ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

CM Chandrababu: సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం..

CM Chandrababu: సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం..
ఇది కూడా చదవండి: Gold Rate Today: మరోసారి భారీగా పడిపోయిన బంగారం ధరలు.. గోల్డ్ కొనాలనుకునే వారికి అదిరే తీపికబురు!

ఈ పథకం కింద వైద్య సిబ్బంది నేరుగా ప్రజల ఇళ్లకు వెళ్లి 42 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ఆయా పరీక్షల నివేదికలను కూడా నేరుగా బాధితుల చేతికే అందిస్తారు. సంజీవని ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగంగా డాక్టర్ అపాయింట్‌మెంట్లు, వర్చువల్ సంప్రదింపులు, డిజిటల్ హెల్త్ రికార్డ్ మేనేజ్‌మెంట్ల కోసం ప్రత్యేకంగా ‘సంజీవని కార్డు’ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు.

ప్రజల వ్యక్తిగత హెల్త్ రికార్డులన్నింటినీ కంప్యూటరైజ్ చేసి క్రమబద్ధమైన పద్ధతిలో పర్యవేక్షిస్తున్నారు. భవిష్యత్తులో అత్యాధునిక ఏఐ ఆధారిత వైద్యులను ప్రవేశపెట్టి త్వరితగతిన సేవలు అందించడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సంజీవని అనేది కేవలం ఒక సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్ మాత్రమే కాదు, ఇది ప్రజలను అనారోగ్యం నుంచి సంపూర్ణ ఆరోగ్యం వైపు నడిపించే ఒక పటిష్టమైన డిజిటల్ పబ్లిక్ హెల్త్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ముఖ్యమంత్రి గర్వంగా ప్రకటించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *