తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

తెలంగాణలో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ తాజాగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది.రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, జూన్ 10న వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే…

Read More

ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు.. తమిళనాడు ప్రభుత్వ కీలక నిర్ణయం

దిగ్గజ చలనచిత్ర దర్శకుడు భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమాన సేవలకు, ఆయన స్థాయికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భారతీరాజాకు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలకాలంటూ తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (టీఎఫ్ఏపీఏ) చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంతకుముందు టీఎఫ్ఏపీఏ ముఖ్యమంత్రికి ఒక విజ్ఞప్తి చేస్తూ, తమ వ్యవస్థాపకుడైన…

Read More

దర్శకుడు ‘భారతీరాజా’ కన్నుమూత

సీఎం విజయ్, సినీ ప్రముఖుల నివాళిచెన్నై: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. 1941 జులై 17న జన్మించిన భారతీరాజా 1977లో వచ్చిన తమిళ మూవీ ‘16 వయథినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) తో దర్శకుడిగా మారారు. ‘కొత్త జీవితాలు’ సినిమాతో తెలుగు…

Read More

ప్రజాస్వామ్య ప్రక్రియకు బీజేపీ తూట్లు – Visalaandhra

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ మండిపాటున్యూదిల్లీ: బీజేపీ ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారి తిరస్కరించడంపై ఆ పార్టీ స్పందించింది. వేణుగోపాల్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందిస్తూ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీయడానికి బీజేపీ చేసిన బహిరంగ ప్రయత్నమని ఆయన అభివర్ణించారు. ఆమె…

Read More

సమాజానికి సేవ చేసే గుణాలను విద్యార్థులు అలవర్చుకోవాలి..

డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్విశాలాంధ్ర ధర్మవరం ; సమాజానికి సేవ చేసే గుణమును విద్యార్థులు అలవర్చుకోవాలని స్పందన హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి వద్ద గల స్పందన హాస్పిటల్ లో ఎస్సీ ఎస్టీ కులమునకు చెందిన పదవ తరగతి విద్యార్థులలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పదిమంది ఎస్సీ,…

Read More

శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జనవిజ్ఞాన వేదికలో భాగస్వాములు కండి

మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్విశాలాంధ్ర ధర్మవరం;; శాస్త్రీయ సమాజా నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదికలో భాగస్వామ్యం కావాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు జనవిజ్ఞాన వేదిక సభ్యత్వ గోడ పత్రికలను స్థానిక స్పందన హాస్పిటల్ లో జేవీవీ నాయకులు విడుదల చేసారు.ఈ సంధర్భంగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ డాక్టర్ మట్లాడుతూ జన విజ్ఞాన వేదిక గత 39 సంవత్సరాలుగా తెలుగు ప్రజలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ప్రజలు శాస్త్రీయంగా…

Read More

పదవ తరగతి రీవాల్యుషన్ లో ఒక మార్కు పెరగడం.. పట్టణములో ప్రధమ కైవసం

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని సీబా రామలింగయ్య మనవడు, ఆయుర్వేద డాక్టర్ శీబా నగేష్ గుప్తా, డాక్టర్ సిబా సంగీత కుమారుడు శీబా కేదార్నాథ్ గుప్తా పదవ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గాను 591 మార్కులు తేవడం జరిగింది. తదుపరి ఆ విద్యార్థికి సంతృప్తి లేకపోవడంతో రీవాల్యుయేషన్ కి దరఖాస్తు చేసుకోగా 592 మార్కులను కైవసం చేసుకోవడం జరిగింది. దీంతో యశోద స్కూల్లో ప్రధమగా రావడం, అదేవిధంగా ధర్మవరం టౌన్ లో రెండవ స్థానాన్ని కైవసం…

Read More

విద్య రంగంపై పాలకుల నిర్లక్ష్యం – Visalaandhra

జి.కోటేశ్వరరావు విజ‌య‌వాడ ః విద్యారంగంపై ప్రభుత్వం అలావంబిస్తున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనంగా విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్ లోని దళవాయ సుబ్బరామయ్య హైస్కూల్ పునఃనిర్మాణం పనులు నిలిచాయి అని సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. దళవాయ సుబ్బరామయ్య హైస్కూల్ పునఃనిర్మాణలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా సిపిఐ స్థానిక 38 , 39 డివిజన్ల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ధర్నాకు హాజరైన సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో విద్య వ్యాప్తికి…

Read More

పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలంటూ మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వామపక్షాల ఆధ్వర్యంలో ఆదోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, కమిటీ సభ్యులు రాజు, సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం నాయకులు పరమేష్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంతో సామాన్య…

Read More

ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన కార్యక్రమం

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా సిపిఎం, ఆర్ఎస్పి పార్టీలు, ప్రజా సంఘాలు వినూత్న కార్యక్రమం విశాలాంధ్ర ధర్మవరం;;వామపక్ష రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా సిపిఎం ఆర్ఎస్పి పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సిపిఎం కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ కాలేజీ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పెద్దన్న, సిపిఎం సీనియర్ నాయకులు ఎస్.హెచ్. భాష,వారు మాట్లాడుతూ, దేశంలో…

Read More