అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..పెరిగిన పసిడి, వెండి ధరలు

ఇవాళ‌ ఒక్కరోజే 3 శాతానికి పైగా పెరిగిన పసిడి, వెండి ధరలు7 శాతానికి పైగా ఎగబాకిన ముడి చమురు ధరలుమధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో ఇవాళ‌ బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడికి డిమాండ్ భారీగా పెరగడంతో ధరలు 3 శాతానికి పైగా ఎగబాకాయి.వివరాల్లోకి వెళితే… ఎంసీఎక్స్ గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 3.12 శాతం పెరిగి 10 గ్రాముల ధర రూ.1,67,155కు చేరింది. అలాగే, ఎంసీఎక్స్ సిల్వర్…

Read More

అట్టహాసంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అవ్వాతాతలకు వరం విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అట్టహాసంగా జరిగింది. పెద్దకడబూరు గ్రామంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ, సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్ అవ్వాతాతలకు…

Read More

దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న పీవీ సింధు

న్యూదిల్లీ:భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం ఆమె ఇంగ్లాండ్‌ వెళ్తోంది. పశ్చిమాసియాలో ఉద్త్రికతల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో సింధు ప్రయాణం ఆగిపోయింది. ‘‘తదుపరి నోటీసు వరకు అన్ని సర్వీసులను రద్దు చేశారు’’ అని సింధు సోషల్‌ మీడియాలో పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్‌ శనివారం ఇరాన్‌పై దాడికి దిగాయి. గల్ఫ్‌ ప్రాంతంలో గగనతలాన్ని మూసి వేయడంతో అనేక విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. దీనితో…

Read More

రఘురామకృష్ణమ రాజు – సునీల్ కుమార్ మధ్య వాగ్యుద్ధం

–సామాజిక మాధ్యమాల ద్వారా వ్యంగ్యాస్త్రాలు అమరావతి: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు, సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సామాజిక, ప్రసారమాధ్యమాల వేదికగా వాగ్ధానాలు సంధించుకుంటున్నారు. పరస్పరం వ్యంగ్యాస్త్రాలతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యేల క్రీడా పోటీల్లో రఘురామ రాజు క్రికెట్ ఆడుతూ కింద పడడంతో ఆయన చేతి మణికట్టుకు గాయం అయింది. దానిపై సునీల్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కస్టోడియల్ టార్చర్ కథ అబద్ధం ఆటలో పడి…

Read More

ఖమేనీ మృతి.. కచ్చితంగా బదులు తీర్చుకుంటాం: ఇరాన్‌ హెచ్చరిక

సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతికి కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఖమేనీ మృతిని ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని ఇరాన్‌ క్యాబినెట్‌ పేర్కొంది. ఖమేనీ మృతిపై ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (IRGC)సంతాపం   తెలిపింది.  తమ సుప్రీం లీడర్‌ను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని, చరిత్రలో ఎన్నడూ…

Read More

ఖామేని మృతి – Visalaandhra

అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖామేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇరాన్‌ మీడియా ధ్రువీకరించింది. ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పేరుతో శనివారం ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఖామేనీ కార్యాలయం లక్ష్యంగా జరిగిన భారీ దాడుల్లో ఆయన మరణించారని ఇరాన్‌ మీడియా పేర్కొంది. దీంతో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఖామేనీ మృతి చెందినట్లు…

Read More

జాలవాడిలో కార్డన్ సెర్చ్

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో శనివారం ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి పర్యవేక్షణలో ఆపరేషన్ వజ్ర పహార్ లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోసిగి సీఐ మంజునాథ్, పెద్దకడబూరు ఎస్‌ఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానిత ప్రాంతాల్లో, షాపుల్లో, ఇళ్లల్లో, పంట పొలాలు గంజాయి, మద్యం, గుట్కాలు, నాటుసారాపై పోలీసులు సోదాలు చేశారు. అనంతరం డీఎస్పీ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ…

Read More

గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిస్తే ఇటువంటి ఘటనలు జరగవు

కల్తీ పాలు మృతులకు 50 లక్షలు పరిహారం ఇవ్వాలి సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె నారాయణ రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో భాదితులను పరామర్శించిన సీపీఐ బృందం రాజమండ్రి : గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచాలని అప్పుడే ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ తెలిపారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఇటీవల కల్తీ పాల వల్ల ప్రమాద సందర్భంగా కిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ అయినా బాధితులు…

Read More

ఘనంగా సైన్స్ డే వేడుకలు

విశాలాంధ్ర-రాప్తాడు : హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ శ్రీ వి.బి.ఆర్. శర్మ మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెడుతూ రూపొందించిన పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్ మరియు వినూత్నమైన టెక్నికల్ మోడల్స్‌ను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.​ఈ వేడుకలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం…

Read More

బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు – Visalaandhra

. ఇప్పటివరకు 21 మంది కార్మికుల మృతి. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి పదిమంది తరలింపు. 50 మీటర్ల 60 మీటర్లు దూరంలో పడిన మృతదేహాలు. మృతులలో మహిళలు. భారీ శబ్దంతో ఉలిక్కిపడ్డ చుట్టుపక్క గ్రామాలు. సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ విశాలాంధ్ర – సామర్లకోట : సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ బానాసంచ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ భారీ పేలుడు ఘటనలో 21 మంది…

Read More