గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

 ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ (LPG) సరఫరా సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడవచ్చన్న ఆందోళనల దృష్ట్యా, శనివారం ఉదయం మంత్రులతో ఆయన అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హోటళ్లు సహా భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు చంద్రబాబు సూచనలు ఇచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా…

Read More

హొర్మూజ్ జలసంధిలో టెన్షన్.. చిక్కుకున్న 34 మంది భారత నావికులు!

ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ మేఘాలు భారత నావికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముంబైకి చెందిన కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ, మరో 33 మంది సిబ్బందితో కలిసి మార్చి 2 నుంచి హొర్మూజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయారు. 36 లక్షల గ్యాస్ సిలిండర్లకు సమానమైన భారీ ఎల్‌పీజీ లోడుతో ఉన్న ఈ ట్యాంకర్, ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం యూఏఈలోని మినా సకర్ పోర్టు వద్ద నిలిచిపోయింది.అక్కడి భయానక పరిస్థితులను కెప్టెన్ వీరేంద్ర స్వయంగా వివరించారు. “మేము రోజూ…

Read More

తగ్గని యుద్ధ జ్వాలలు – Visalaandhra

ఇరాన్‌పై విరుచుకుపడుతోన్న అమెరికా`ఇజ్రాయిల్ దళాలుప్రతీకార దాడులు కొనసాగిస్తోన్న ఇరాన్గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లిన తెహ్రాన్ క్షిపణులు, డ్రోన్లుదుబాయ్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఉధతమవుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ ప్రతీకార దాడులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. యుద్ధం 14వ రోజైన శుక్రవారం తెహ్రాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా వాషింగ్టన్, తెలఅవీవ్ యుద్ధవిమానాలతో దాడులు కొనసాగించాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై, గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఒమన్‌పై తెహ్రాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో…

Read More

బోసిపోయిన దుబాయ్

పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో తగ్గిన పర్యాటకులు దుబాయ్: పర్యాటకులు, దేశ విదేశీ పెట్టుబడిదారులతో నిన్న మొన్నటి వరకు కళకళలాడిన దుబాయ్ బోసిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య సంఘర్షణ ఈ నగరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్‌లు, వాణిజ్య సంస్థలను మూసివేశారు. బుర్జ్ అల్ అరబ్ సహా పలు ప్రముఖ హోటళ్లు క్షిపణి దాడులకు గురవ్వడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. విమాన సర్వీసులు భారీగా రద్దవ్వడంతో పర్యాటక రంగమూ కుదేలైంది….

Read More

16నుండి పది పరీక్షలు

ఉదయం 9.30 నుండి 12.45గంటల వరకు -27,360 మంది విద్యార్థులకు 149 సెంటర్లు -పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు… కలెక్టర్ జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు సజావుగా పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.పదో తరగతి పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ, డీఈవో…

Read More

పండగలా అన్నదాత సుఖీభవ – Visalaandhra

పండగలా అన్నదాత సుఖీభవ – Visalaandhra జిల్లాలో రైతులకు రూ. 67.69 కోట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా అన్నదాతల ఆర్థిక స్థిరత్వానికి చేయూత లభిస్తోందని ఇలాంటి పథకాలను…

Read More

వాలీబాల్ జట్లకు శిక్షణ శిబిరం ముగింపు

విశాలాంధ్ర – భోగాపురం :జాతీయ స్థాయి అండర్–21 వాలీబాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ పురుషుల, మహిళల జట్లకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భోగాపురంలోని మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రాంగణంలో ఈ శిబిరం జరిగింది. జిల్లా వాలీబాల్ చరిత్రలో తొలిసారిగా జాతీయ స్థాయి జట్టు ఎంపిక, శిక్షణ శిబిరాన్ని భోగాపురంలో నిర్వహించడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా పురుషులు, మహిళల జట్లకు ఒకేసారి…

Read More

నిబద్ధత కలిగిన వారిని పార్టీలో భాగస్వాములను చేయండి – నాగబాబు

విశాలాంధ్ర – భోగాపురం : నిబద్ధత కలిగిన వారిని పార్టీలో భాగస్వాములను చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. శాసనసభ్యులు లోకం నాగ మాధవి క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొణిదెల నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పారదర్శకమైన రాజకీయాల కోసం జనసేన కృషి…

Read More

​మహిళా సాధికారతతోనే సమాజ వికాసం: ఆర్డీటీ రీజినల్ డైరెక్టర్ లక్ష్మణరావు

విశాలాంధ్ర-​రాప్తాడు : మహిళా సాధికారత, సమానత్వం, గౌరవం ప్రతి మహిళా స్వతంత్రంగా పొందే హక్కు అని, మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత పురుషులపై ఉందని ఆర్డీటీ బుక్కరాయసముద్రం రీజినల్ డైరెక్టర్ లక్ష్మణరావు పేర్కొన్నారు. శుక్రవారం రాప్తాడు ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీసులో అనంతసిరి మహిళా కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల నెట్‌వర్క్ లీడర్లతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంత సిరి మహిళా కో-ఆపరేటివ్ బ్యాంక్…

Read More

జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు

–కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు కలెక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరికవిశాలాంధ్ర`విజయవాడ: జిల్లాలో వంట గ్యాస్‌కు కొరత లేదని, బాట్లింగ్, సరఫరాలో ఎక్కడా ఇబ్బంది లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నించినా, బ్లాక్ మార్కెటింగ్ కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ హెచ్చరించారు. కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్‌డీవోలు, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం…

Read More