సర్వర్లలో సాంకేతిక లోపం… తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రధాన సర్వర్లలో సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయి. స్లాట్ బుక్ చేసుకున్నవారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియతో పాటు అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.స్లాట్లు బుక్ చేసుకున్నవారు, కొనుగోలుదారులు, విక్రేతలు ఉదయం నుంచి రిజిస్ట్రేషన్…

Read More

ఏప్రిల్ 1 నుంచి రైల్వే కొత్త నిబంధనలు.. ప్రయాణికులకు ఊరట..

భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. టికెట్ల రద్దు, బోర్డింగ్ స్టేషన్ మార్పునకు సంబంధించి నిబంధనలను సవరించింది. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌లో దళారుల దందాకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య దశలవారీగా అమల్లోకి రానున్నాయి.టికెటింగ్ విధానంలో దళారులు చేస్తున్న మోసాలను అరికట్టేందుకే రిఫండ్ నిబంధనలను కఠినతరం చేసినట్లు రైల్వే…

Read More

ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ – Visalaandhra

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్త వచ్చింది. ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్)కి ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేశామని కేంద్రం నుంచి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీపి కబురు అందించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కి కేంద్రం నుంచి ఫోన్ ద్వారా ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేయడం జరిగిందని సమాచారం వచ్చింది. ఈ…

Read More

మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు.. హెడ్మాస్టర్ రాజేశ్వరరావు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2026-27 సంవత్సరమునకు నూతనంగా విద్యార్థుల ప్రవేశాలకు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రవేశాలు పొందవచ్చునని ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రాజేశ్వరరావు, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ కృష్ణవేణి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలో చదువుతోపాటు అన్ని వసతులను కల్పించడం జరిగిందని, తల్లిదండ్రులు గమనించి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఉచిత మధ్యాహ్న భోజనం, యూనిఫారంలు బూట్లు, పుస్తకాలు, నోర్సులు అందించడం…

Read More

తప్పుడు కేసులు పెరిగిపోతున్నాయి…

కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులుదేశవ్యాప్తంగా క్రిమినల్ న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న తప్పుడు ఫిర్యాదులు, కల్పిత ఆరోపణలు, నకిలీ సాక్ష్యాల సమస్యపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం.. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ఈ…

Read More

పిల్లల పౌష్టికాహారంపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండన…జనవిజ్ఞాన వేదిక

విశాలాంధ్ర ధర్మవరం;;ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే కోడిగుడ్ల గురించి వారికి ఇచ్చే మధ్యాహ్న భోజనం, బ్యాగు, షూస్, యూనిఫారం గురించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవి, అమానుషమైనవనీ, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి, ధర్మ ప్రబోధాలు చేసే వ్యక్తి, పేద పిల్లల ఆకలిని , వారి ప్రాథమిక హక్కులను కించపరిచేలా మాట్లాడటం శోచనీయమని జెవివి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ…

Read More

హోటళ్లకు సులభ సరఫరా… సాధారణ ప్రజలకు కష్టాలే!

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలో భరత్ గ్యాస్ కార్యాలయం నిర్వాహణపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ సమయాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు, తరచూ కార్యాలయం మూసివేయబడుతుండటం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.గ్యాస్ బుకింగ్ కోసం కార్యాలయానికి వచ్చే వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండి, చివరకు నిరాశతో వెనుదిరుగుతున్న దృశ్యాలు సాధారణంగా మారాయి. ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలతో కలిసి కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన…

Read More

తాగునీటి నాణ్యతపై అవగాహన – Visalaandhra

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : తాగునీటి నాణ్యత పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మంగళవారం ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయ ఇంజనీర్లకు, కార్యదర్శులు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రవి ప్రసాద్,మరియు ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఐజయ్య హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఫీల్డ్ టెస్ట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీటి నాణ్యతను నిరంతరం పరీక్షించడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించవచ్చని వివరించారు….

Read More

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు భాస్కర్ కు ఆర్థిక సహాయం..

సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు క్రియాశీలక సభ్యుడుగా ఉంటూ సంస్థకు ఎంతో సేవలను సభ్యుడు భాస్కర్ (శివ) అందించడం జరిగింది. కానీ శివ భార్యకు ఇటీవలే బత్తలపల్లి ఆర్ డి టి హాస్పిటల్ లో ఆపరేషన్ చేసి, సర్జరీ చేశారు. సమాచారం అందుకున్న మానవతా సంస్థ ట్రస్ట్ కమిటీ వారు వారిని ఆప్యాయంగా పలకరించి, పరామర్శించారు. తదుపరి ఆ కుటుంబానికి సంస్థ తరఫున రూ .10,000, వ్యక్తిగత సభ్యుల తరఫున…

Read More

సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్.. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు సంబంధించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. పురుష అధికారులతో సమానంగా మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్ (పర్మనెంట్ కమిషన్) పొందే అర్హత ఉందని స్పష్టం చేసింది. శారీరక సామర్థ్యం లేదా ఇతర సామాజిక కారణాలను చూపి వారికి ఈ అవకాశాన్ని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ద్వారా సైన్యంలో చేరిన మహిళా అధికారులు కూడా…

Read More