అఫ్గాన్ ఆసుపత్రిపై పాక్ దాడిలో 400కు పెరిగిన మృతులు

కాబూల్: అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ మెరుపు దాడి చేసింది. ఆ దేశ రాజధాని కాబూల్‌పై విరుచుకుపడింది. అక్కడి ఆసుపత్రిపై వైమానిక దాడి చేయగా, 400 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని అధికారులు వెల్లడించారు. అఫ్గాన్, పాక్ మధ్య సరిహద్దు ఘర్షణ చాలా కాలంగా సాగుతున్నది. కాబూల్‌లోని 9వ పోలీస్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న డ్రగ్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని లక్ష్యంగా పాకిస్థాన్ చేసిన తాజా…

Read More

అమెరికాకు చైనా షరతు – Visalaandhra

బీజింగ్: అమెరికాకు చైనా ఓ షరతు పెట్టింది. పశ్చిమాసియాలో యుద్ధం ఆపేస్తే హోర్ముజ్ జల సంధిలో నౌకల రక్షణకు సిద్ధమని ప్రకటించింది. యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో తమకు మద్దతుగా యుద్ధనౌకలు పంపాలంటూ ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపునకు చైనా స్పందించింది. ప్రపంచ ఇంధన సరఫరా, ప్రాదేశిక శాంతి, సుస్థిరతకు నష్టం కలిగించవద్దని సూచించింది. ఉద్రిక్తతలు పెరిగితే తీవ్ర పరిణామాలు తప్పబోవని హెచ్చరించింది. పరిస్థితి చేయిదాటనివ్వద్దని…

Read More

గల్ఫ్‌పై ఇరాన్ దాడులు ఊహించలేదు: ట్రంప్

వాషింగ్టన్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుందని తాము ఊహించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దీనిని హఠాత్పరిణామంగా వర్ణించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైత్‌పై ఇరాన్ ప్రతిదాడులు తమను షాక్‌కు గురిచేశాయని ట్రంప్ చెప్పారు. పశ్చిమాసియాలోని ఈ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తుందని ఏ మాత్రం ఊహించలేదని, ఆ ఆలోచన కూడా రాలేదని అన్నారు. తమ దాడులను ఇరాన్ తీవ్రస్థాయిలో ప్రతిఘటించిందని తెలిపారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను…

Read More

ఈపీఎఫ్ కనీసపింఛను పెంచాలి

కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదన న్యూదిల్లీ: ఈపీఎఫ్ చందాదారులు పదవీ విరమణ తర్వాత పొందే పెన్షన్‌కు సంబంధించి పార్లమెంటరీ కమిటీ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995 కింద ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.1000 కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ మొత్తం వాస్తవికంగా, గౌరవప్రదంగా ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు లేబర్, టెక్ట్స్‌టైల్స్, స్కిల్‌డెవలప్‌మెంట్‌పై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 15వ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ఈపీఎస్…

Read More

నేడు ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభం

. రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 40 శాతానికిపైగా వైకల్యముంటే వర్తింపు. 12.76 లక్షల మందికి లబ్ధి విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిలో ప్రారంభించనున్నారు. నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం…

Read More

శాంతికి సమయం కాదు

కాల్పుల విరమణ ప్రసక్తే లేదు ` ప్రతీకారం తప్పదుశుత్రువులు ఓటమి అంగీకరించే వరకు పోరు ఆగదుఅధినేత ముజ్తబా ఖామేనీ స్పష్టీకరణ తెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేలా కాల్పుల విరమణకు చేసిన ప్రతిపాదనలను ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ తిరస్కరించారు. శాంతికి ఇది సరైన సమయం కాదని అన్నారు. కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, అమెరికాఇజ్రాయిల్‌పై ప్రతీకారం తప్పదని అన్నారు. అమెరికాఇజ్రాయిల్ విషయంలో అధినేత చాలా కఠిన వైఖరితో ఉన్నట్లు ఇరాన్ అధికారి ఒకరు అన్నారు. ఇజ్రాయిల్అమెరికా తమ…

Read More

సరిపడా గ్యాస్ నిల్వలు

మరో 15 రోజుల వరకు ఢోకా లేదుప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నాంముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మరికొన్ని మెట్రిక్ టన్నులు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు…

Read More

జేడీయూకు కేసీ త్యాగి రాజీనామా

పట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జేడీయూ సలహాదారు, నితీశ్ సన్నిహితుడు కేసీ త్యాగి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన మరుసటి రోజే త్యాగి ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. జేడీయూ జాతీయ కార్యదర్శి, పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన త్యాగి…ఆ పార్టీ అవతరించినప్పటి నుంచి కొనసాగుతున్నారు. నితీశ్ కుమార్‌తో దాదాపు 50 ఏళ్లు కలిసి రాజకీయాల్లో పనిచేశారు. తాజాగా జేడీయూ సభ్యత్వాన్ని…

Read More

పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం – Visalaandhra

కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన న్యూదిల్లీ: పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం తీసుకురా వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. పిల్లలు, వారి తల్లిదండ్రుల అవసరాలకు అనుగుణంగా సెల వులు నిర్ణయించాలని పేర్కొంది. మాతృత్వ సెలవులపై కేసులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు మంగళ వారం పితృత్వ సెలవులపైనా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తండ్రులకు కూడా సెలవులు ఉండాల్సిం దేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదని, తండ్రికి కూడా సమాన బాధ్యత…

Read More

గూడు ఘోష

. పేదల సొంతింటి కల నెరవేరేదెన్నడు?. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఎప్పుడు?. మూడు బడ్జెట్లయినా కేటాయింపులు నిల్. సామాన్య, మధ్యతరగతిపై ఇంటి అద్దెల భారం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: పేదలకు గృహ భద్రత కల్పించడం ఏ ప్రభుత్వానికైనా అత్యంత కీలకమైన సామాజిక బాధ్యత. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు దిశగా ముందుకు సాగకపోవడంతో వేలాది పేద కుటుంబాలు అనిశ్చితిలో…

Read More