AP weather: ఏపీ ప్రజలకు అలెర్ట్.. 17 మండలాల్లో తీవ్ర వడగాలులు.. బయటకు రావద్దని హెచ్చరిక! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
ఆదివారం 17మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే సోమవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదివారం (05-04-26) శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, బూర్జ, హీరమండలం, జలుమూరు, లక్ష్మీనర్సుపేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాలు, విజయనగరం జిల్లా గుర్ల, సంతకవిటి…


