ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 21 నుంచి ప్రారంభం


నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు – మాల్ ప్రాక్టీస్‌పై కఠిన చర్యలు

ప్రిన్సిపల్ కృష్ణమూర్తి

విశాలాంధ్ర – ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు ఎం. కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను ముందుగానే తెలుసుకొని కనీసం అరగంట ముందు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
25095 బాలికల జూనియర్ కళాశాల కేంద్రానికి వి.హెచ్.బి. షాషావలి, 25097 ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రానికి నారాయణ రెడ్డి చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాలకు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి ఉండదన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకొని పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులు,వారి తల్లిదండ్రులు కళాశాలను సందర్శించి తమకు కావలసిన గ్రూపుల్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల మాయలో పడకుండా అనేక సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే విద్యార్థులను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది మార్చి పరీక్షల్లో 550 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు తమకు నచ్చిన ఏ గ్రూపులోనైనా ఉచితంగా చేరవచ్చని ప్రత్యేకంగా తెలిపారు. ఇందుకు కావలసిన ఫీజును కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపక సిబ్బంది కలిసి చెల్లిస్తారని చెప్పారు. అలాగే మొదటి సంవత్సరం పరీక్షల్లో 95 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *