హెడ్మాస్టర్ ఉమాపతి
విశాలాంధ్ర ధర్మవరం;; పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పట్టణంలోని శాంతినగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజయ డంకా మోగించడం జరిగిందని హెడ్మాస్టర్ ఉమాపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 52 మంది పరీక్షలు రాయగా అందులో 31 మంది ఉత్తీర్ణులు కాగా 60 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. ఇందులో ఎస్ గణేష్ 580 మార్కులు తో పాఠశాల ప్రధమగా నిలవగా, 574 మార్కులతో పి సప్తగిరి రెండవ స్థానం, ఎస్ వైష్ణవి 567 మార్కులతో మూడవ స్థానమును పొందడం జరిగిందన్నారు. వీరందరికీ హెడ్మాస్టర్, పాఠశాల కమిటీ చైర్మన్ తో పాటు ఉపాధ్యాయ బృందం అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.


