ఇవాళ ఉష్ణోగ్రతను చూస్తే.. తెలంగాణలో 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఏపీలో కూడా 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ముఖ్యంగా రాయలసీమలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఒంగోలు, కర్నూలు, కడప, అనంతపురం, తిరుపతి, చిత్తూరు, హిందూపురం, నెల్లూరు ప్రాంతాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం 2 తర్వాత ఉష్ణోగ్రతలు కొంత తగ్గుతాయి. అప్పటివరకూ బయటకు వెళ్లేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కళ్లు తిరిగేలా. నీరసంగా ఉంటే.. వెంటనే నీడలో ఉండి, నీరు తాగాలి. తేమ తెలంగాణలో 27 శాతం ఉంటే, ఏపీలో 46 శాతం ఉంటుంది.



