నిరుపేదలకు గొడుగులు,పాదరక్షలు పంపిణీ


విశాలాంధ్ర – కడియం : సమాజంలో కష్టాలలో ఉన్నవారికి తోడుగా నిలబడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చిరు సేవా సమితి అధ్యక్షులు గెడ్డం శివ రత్న గణపతి అన్నారు. మండు వేసవిలో రోడ్లపై జీవనం సాగిస్తున్న నిరుపేదలు, నిరాశ్రయులు, యాచకుల కష్టాలను గుర్తించి చిరు సేవా సమితి తరపున పాదరక్షలు గొడుగులు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ నుంచి గోదావరి బండ్ మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు నివసిస్తున్న బాధితులకు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. అభాగ్యులను ఎంతోకొంత ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు సేవా స్ఫూర్తితో గత మూడు దశాబ్దాలుగా “చిరు సేవా సమితి” ఆధ్వర్యంలో నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చిరు సేవా సమితి ఎప్పటికీ సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని గెడ్డం శివరత్న గణపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరు సేవా సమితి సభ్యులు తాడాల ప్రేమ్, గాధ గోపాలకృష్ణ, తాడాల ధర్మరాజు, మల్లు రామకృష్ణ, గట్టి కిరణ్, కొత్తపల్లి నాని, బిట్టు, తాడాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

The post నిరుపేదలకు గొడుగులు,పాదరక్షలు పంపిణీ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *