గోదావరి జిల్లాల ప్రజలు దేవుడిగా కొలిచే మహానుభావుడు Sir Arthur Cotton జయంతి సందర్భంగా తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. రాజమండ్రి కేంద్రంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని కాటన్ దొర విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రహదారిపై వెళ్తూ ఆయన విగ్రహానికి చేతులు జోడించి నమస్కరించే ప్రజలను చూస్తే గోదావరి ప్రజల హృదయంలో కాటన్ దొరకు ఉన్న స్థానం ఎంత గొప్పదో అర్థమవుతుంది.



