చెట్టు కొమ్మ విరిగిపడి మహిళకు తీవ్ర గాయాలు
విశాలాంధ్ర–రొళ్ళ: మండల కేంద్రంలోని మడకశిర రోడ్డులో ఎస్.ఎల్.ఎన్ హోటల్ సమీపంలో నెలలుగా ఎండిపోయి ప్రమాదకరంగా నిలిచిన జువ్వి చెట్టు గురువారం ఒక మహిళకు తీవ్ర గాయాలకు కారణమైంది. సంబంధిత శాఖల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గురువారం మధ్యాహ్నం అంగన్వాడీ కార్యకర్త జయలక్ష్మి తన భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బస్టాండ్ వైపు వెళ్తుండగా, అకస్మాత్తుగా ఎండిన కొమ్మ విరిగి ఆమె తలపై పడింది. ఈ ఘటనలో ఆమెకు తలకు బలమైన గాయమైంది. ఘటనను గమనించిన…


