అరసం 20 వ రాష్ట్ర మహాసభల సందర్భంగాయువ రచయితలకు కథ, కవితల పోటీ
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 20వ రాష్ట్ర మహాసభలు మే నెలలో తిరుపతిలో జరుగనున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని యువతకు కథ, కవిత్వ రచనలో పోటీని నిర్వహిస్తోంది. ఉత్సాహవంతులైన యువ కవులు, కథకులను ప్రోత్సహించడమే పోటీల ప్రధాన లక్ష్యం. విజేతలకు బహుమతీ ప్రదానం మహాసభల వేదిక మీద జరుగుతుంది. పెదపరిమికి చెందిన మొవ్వా చిన బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో ఈ పోటీలను అరసం నిర్వహిస్తోంది.కథా రచనలో మొదటి బహుమతి రూ.5000 లు, ద్వితీయ…


