ధర్మవరంలో డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం
– ప్రజా సమస్యలపై వేగవంతమైన స్పందన.. మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం తప్పక ఉంటుందని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బలిజ కళ్యాణ మండపం వీధి పరిధిలో డ్రైనేజీ కాలువల్లో మట్టి పేరుకుపోయి మురుగునీరు నిలిచిపోవడంతో తీవ్ర దుర్వాసన వ్యాపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తొగటవీర సంఘం అధ్యక్షులు గుద్దేటి రాము, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య…


