రాజమండ్రి కల్తీ పాల ఘటన: కారణాలపై విచారణ ముగింపు, విషమే కారణమని నిర్ధారణ.
రాజమండ్రి: రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఫోరెన్సిక్ ల్యాబ్ తుది నివేదిక వెల్లడించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎఫ్ఎస్ఎల్, ఆర్ఎఫ్ఎస్ఎస్ ల్యాబ్ల నివేదిక ప్రకారం, పాల వ్యాపారి సరఫరా చేసిన పాలలో ఈజీ-ఇథైలిన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనం కలుషితమైంది. దీనివల్ల బాధితుల కిడ్నీలు దెబ్బతిని మరణించారు. కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన అడ్డాల గణేశ్వరరావు ‘వరలక్ష్మి’ పాల కేంద్రం ద్వారా పాలను సరఫరా చేస్తున్నారు. ఫ్రీజర్ లీక్ అవ్వడంతో…


