Theft Case: 18 సచివాలయాల్లో ఇంజనీరింగ్ విద్యార్థి ల్యాప్టాప్స్, ప్రింటర్స్ చోరీ.. వాటి విలువ ఎంతో తెలుసా.. | చిత్తూరు వార్తలు (Chittoor News)
ఎస్.ఆర్. పురం మండలం, కన్యాకాపురం గ్రామానికి చెందిన సి. మహేష్ బాబు (22) తిరుపతిలో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే, చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన వయసులో ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసయ్యాడు. బెట్టింగ్లో పోగొట్టుకున్న డబ్బును సంపాదించడానికి, విలాసవంతమైన జీవనశైలిని కొనసాగించడానికి దొంగతనాల బాట పట్టాడు. ఇతను సామాన్య ఇళ్లలో కాకుండా, రక్షణ తక్కువగా ఉండే ప్రభుత్వ సచివాలయాలను తన లక్ష్యంగా ఎంచుకోవడం గమనార్హం. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, పోలీసులు ప్రధాన రహదారులపై…


