పోలవరానికి మరో రూ.1,301 కోట్లు.. అడ్వాన్స్ నిధుల కింద కేంద్రం విడుదల
ఆంధ్రప్రదేశ్కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది.తాజాగా రూ.1,301 కోట్ల అడ్వాన్స్ నిధులు మంజూరు చేయడంతో, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం విడుదలైన నిధులు రూ.2,809 కోట్లకు చేరాయి.ఇప్పటికే రూ.1,508 కోట్లు విడుదల కాగా,తాజా కేటాయింపుతో రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన బడ్జెట్ అంచనాలకు దగ్గరగా నిధులు సమీకరించినట్లైంది.గతంలో విడుదలైన రూ.1,508 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పనులకు ప్రాధాన్యత ఇచ్చింది.అందులో రూ.600 కోట్లు…


