అసెంబ్లీ పోరుకుసర్వం సిద్ధం

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తున్న అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. గురువారం రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అసోం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ప్రజలు తమ తీర్పును ఇవ్వనున్నారు. మూడు ప్రాంతాల్లో కలిపి 6.1 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఒక అగ్నిపరీక్షగా మారనున్నాయి. తమిళనాడు, పశ్చిమ…

Read More

లూలుకు భూకేటాయింపుపైవెనక్కి తగ్గిన ప్రభుత్వం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: విజయవాడలో లూలు గ్రూపుకు భూముల కేటాయింపుపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలోని ఆర్‌టీసీ స్థలాన్ని లూలు మాల్‌కు కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో లూలు మాల్‌కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్‌పేట ఆర్‌టీసీ డిపోకు…

Read More

అమరావతికి మరో కీలక ప్రాజెక్టు – Visalaandhra

కేంద్ర కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణంరూ.2,534 కోట్లతో కార్యాలయాలు, నివాస భవనాలు22.53 ఎకరాలు కేటాయించిన సీఆర్‌డీఏ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణం చేపడుతున్న తరహాలోనే… అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాటిలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.2,534 కోట్లతో చేపట్టనున్న ఈ నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్‌ను…

Read More

ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం

. పోర్టు కారిడార్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు. గోదావరి పుష్కరాల్లోపే రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు పూర్తి. ఈవీ బస్సుల వినియోగం పెంచుదాం. సీఎం చంద్రబాబు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం రహదారులు,…

Read More

తోక ముడిచిన ట్రంప్ – Visalaandhra

ఇరాన్‌పై రెండు వారాలు సైనిక చర్య నిలిపివేసినట్లు ప్రకటన . ఈ లోగా ఒప్పందం చేసుకుంటామని వెల్లడి. పది షరతులతో కాల్పుల విరమణకు అంగీకరించిన తెహ్రాన్. దురాక్రమణకు పాల్పడితే దీటుగా స్పందిస్తామని హెచ్చరిక. రేపు ఇస్లామాబాద్‌లో చర్చలకు ఇరుదేశాలకు పాక్ ఆహ్వానం తెహ్రాన్/వాషింగ్టన్: ఒక్క రాత్రిలో ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తామని ప్రగల్బాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఇరాన్ చూపిన తెగువకు తల వంచారు. ీVAర్మోజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ఇచ్చిన నలభై ఎనిమిది గంటల గడువు మరో…

Read More

నేటి నుంచి దుకాణాల వేలం

అందుబాటులో 36 కాలనీల్లో 1400 షాపులు విశాలాంధ్ర – హైదరాబాద్: భాగ్యనగరంలోని క్యూర్ పరిధిలో డబుల్ బెడ్ రూం కాలనీల్లో ఉన్న 1400కు పైగా దుకాణాలను బహిరంగ వేల ద్వారా విక్రయించే ప్రక్రియ గురువారం నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 36 కాలనీల్లో ఉన్న దుకాణాలను వేలం ద్వారా విక్రయించడానికి ఆయా జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీచేశారు. తొలుత రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎనిమిది కాలనీల్లో…

Read More

అసత్యాలు ఆపండి

. నాదర్‌గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ మీరే. కోర్టుకు వెళ్లి కొట్లాడుతున్నది మేమే. వట్టినాగులపల్లి వివాదం మీ ‘కుటుంబ పంచాయితీ’. కొత్వాల్‌గూడ క్రషర్‌పై అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు. బీఆరఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ధ్వజం విశాలాంధ్ర – హైదరాబాద్: నాదర్‌గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ బీఆరఎస్‌దేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న అబద్ధాల రావు, డ్రామా రావు, శకుని…

Read More

తాగునీటి కొరత రానీయొద్దు – Visalaandhra

అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం విశాలాంధ్ర-హైదరాబాద్: వేసవి నేపథ్యంలో వచ్చే రెండు, మూడు నెలలు అత్యంత కీలకమని, ఈ సమయంలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణ జల సరఫరా శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి బుధవారం అధికారులతో మంత్రి సమీక్ష సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా అవసరానికి తగ్గట్టుగా వినియోగించేలా అవగాహన పెంచాలని సూచించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో తాగునీటి…

Read More

బౌలర్లే కొంప ముంచారు

హార్దిక్ పాండ్యముంబై: సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. మంగళ వారం రాత్రి గువహతిలో రాజ స్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యనేతత్వంలోని ముంబై జట్టు పూర్తిగా తేలిపోయింది. ఈ ఓటమికి పూర్తి బాధ్యత బౌలింగ్ యూనిట్‌దేనని పాండ్య తెలి పాడు. కనీసం ఐదు మంచి బంతు లేసినా తమకు గెలిచే అవకాశం ఉండేదన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ “మా జట్టు ఓటమిలో బ్యాటర్ల తప్పేం లేదు. లక్ష్యం ఎక్కువగా ఉండటంతో మొదటి బంతి…

Read More

రామస్వామి గుడిలో వెండి కిరీటాలు మాయం..

అంబేద్కర్ నగర్ కాలనీలో కలకలం…. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : – మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న స్థానిక రామస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. తెలియని దుండగులు స్వామివారి వెండి కిరీటాలను అపహరించినట్లు సమాచారం. సుమారు 5 గ్రాముల బరువున్న వెండి కిరీటాలు మాయం అయినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు….

Read More