టీఎంసీ మ్యానిఫెస్టో విడుదల – Visalaandhra

10 కీలక హామీలతో విడుదల మమత కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదలకు సిద్ధపడుతున్నాయి. ఈ ఎన్నికలకు అధికార టీఎంసీ ముందు నుంచి దూకుడును ప్రదర్శిస్తోంది. అభ్యర్ధులను ముందుగానే ప్రకటించి అందరినీ అలోచనలో పడేసింది. అదే క్రమంలో శుక్రవారం తమ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది. రాష్ట్రంలో వరుసగా నాలుగోసారి అధికార పగ్గాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలకు పలు వాగ్దానాలు చేశారు. ప్రతి…

Read More

పెరగనున్న బ్రిటన్ వీసా చార్జీలు – Visalaandhra

లండన్: బ్రిటన్ స్టూడెంట్, విజిటర్, వర్క్ వీసాలతో పాటు అన్ని రకాల వీసా రుసుములు పెరగనున్నాయి. ఈ మేరకు బ్రిటన్ హోమ్ ఆఫీస్ ప్రకటించింది. దీంతో విదేశీయులపై సుమారు ఆరు శాతం నుంచి ఏడు శాతం నుంచి వరకు అదనపు ఆర్థిక భారం పడనుంది. గతంలో 524 పౌండ్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.65,730)గా ఉన్న విద్యార్థి వీసా రుసుము ఇప్ప్పుడు 558 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.69,814) పెరిగింది. మూడేళ్ల కాలపరిమితిగల…

Read More

అమెరికా ఎఫ్-35కి ఇరాన్ దెబ్బ

తెహ్రాన్: అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాన్ని ఇరాన్ ద్బెతీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్ విడుదల చేసింది. ఎఫ్-35 యుద్ధ విమానాన్ని తమ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోవడంతో అది పశ్చిమాసియాలోని అమెరికా స్థావరంలో అత్యవసరంగా దిగిందని ఇరాన్ ఒక ప్రకటన చేసింది. ‘మా గగనతల రక్షణ వ్యవస్థ అర్ధరాత్రి దాటిన తర్వాత అమెరికా సైన్యానికి చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని దెబ్బతీసింది. అది ఏ స్థాయిలో దెబ్బతిన్నదనే దర్యాప్తు చేస్తున్నాం. విమానం పూర్తిగా ధ్వంసం కావడానికే…

Read More

ట్రంప్ చైనా పర్యటన వాయిదా – Visalaandhra

వాషింగ్టన్: తన చైనా పర్యటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేసుకున్నారు. సుమారు నెలన్నర రోజులు పాటు ఈ పర్యటన వాయిదా పడింది. ఇదే విషయాన్ని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ‘చైనా పర్యటనను నెలన్నర రోజులు వాయిదా వేసుకున్నా. ఇది ఖరారైంది కానీ, చైనాలో పర్యటించాలని ఎదురు చూస్తున్నా’ అని ఓవల్ కార్యాలయంలో ట్రంప్ వెల్లడించారు.ఇరాన్ చమురు క్షేత్రాలపై దాడులు వద్దని ఇజ్రాయిల్‌కు సూచించినట్లు ఆయన తెలిపారు. ‘మా దేశాలకు సమన్వయం కుదిరింది కానీ ఇజ్రాయిల్…

Read More

బతికే ఉన్నాం

నెతన్యాహు`ముజ్తబా వీడియో రుజువులు తెహ్రాన్/తెల్ అవీవ్: పశ్చిమాసియాలో యుద్ధం తారస్థాయికి చేరుకున్న తరుణంలో ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ మరణించినట్లు అమెరికా అనుకూల వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టాయి. అటు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జాడలేరని, ఆయన ప్రాణాలతోనే ఉన్నారా అంటూ ఇరాన్ మీడియా అనుమానాలు రేకెత్తించింది. దీంతో ఆ ఇద్దరు నాయకులు తామింకా బతికే ఉన్నామని రుజువు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నెతన్యాహు కొన్ని వీడియోలు విడుదల చేయడం, ఇటీవల అమెరికా…

Read More

ఇరాన్ యురేనియం శుద్ధి చేయలేదు

జెరూసలేం: పశ్చిమాసియా యు ద్ధంలో ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతీసి నట్లు ఇజ్రాయిల్ ప్రకటించుకుంది. యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యాన్ని ఇరాన్ కోల్పోయిందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. నిర్దేశించుకున్న మూడు లక్ష్యాలు సాధించడమే ఇరాన్‌పై యుద్ధం ముఖ్య ఉద్దేశంగా తెలిపారు. ఇరాన్ నుంచి అణుముప్ప్పును తొలగించడం, దాని సైనిక సామర్థ్యాలను అణగదొక్కడం, అక్కడి ప్రజలకు స్వేచ్ఛ కల్పించడమే అజెండాగా నెతన్యాహు చెప్పారు. ఇరాన్‌కు భారీగా నష్టం కలిగించా మని, క్షిపణి నిల్వలు, వాటి…

Read More

అత్యంత కనిష్ఠానికి రూపాయి పతనం

ముంబై: పశ్చిమాసియా యుద్ధం అన్నిరంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి పతనమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 86 పైసలు క్షీణించి 93.75 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 74,559.38 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో దాదాపు వెయ్యి పాయింట్ల మేర లాభపడి 75,286.39 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో సెన్సెక్స్ 325.72 పాయింట్ల లాభంతో 74,532.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం…

Read More

పెట్రోలు ధర రూ.2.35 పెంపు – Visalaandhra

న్యూదిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వేళ మోదీ సర్కారు పెట్రోలు ధరలు పెంచేసింది. ప్రీమియం పెట్రోలు ధర లీటర్‌కు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోలు ధర పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ప్రకటించింది. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. బీపీసీఎల్ స్పీడ్, ఐవోసీఎల్ ఎక్స్‌పీ95 ప్రీమియం పెట్రోల్ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ప్రాంతాన్ని బట్టి లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకూ పెట్రోలియం సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధర పెంచాయి. సవరించిన…

Read More

ఆరని చమురు మంటలు

కువైట్ రిఫైనరీపై ఇరాన్ మళ్లీ దాడులు . కువైట్ నుంచి యూఏఈ వరకు డ్రోన్లు, క్షిపణులు. భూమ్మీద రక్షణ లేకుండా చేస్తాం: అమెరికా, ఇజ్రాయిల్‌కు హెచ్చరిక. సైనికాధికారి మహమ్మద్ నయినీ మృతి. హోర్ముజ్ కోసం ఒక్కటైన ఆరు దేశాలు తెహ్రాన్/దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం మూడవ వారం భీకరంగా సాగుతూ ప్రమాదక స్థాయికి చేరుకుంది. ఈ దశలో చమురు క్షేత్రాలపై దాడులు తీవ్రతరమ య్యాయి. అమెరికా`ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై విరుచుకుపడున్నాయి. ఇరాన్ కూడా తమ ప్రతీకార దాడులతో శుత్రువుల…

Read More

జిల్లా కలెక్టర్‌గా విజయ సునీత – Visalaandhra

విశాలాంధ్ర – మార్కాపురం : మార్కాపురం జిల్లా తొలి నూతన కలెక్టర్‌గా ఎం.విజయ సునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం మార్కెటింగ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 30న ఏర్పాటు చేసిన నూతన మార్కాపురం జిల్లాకు తొలి కలెక్టర్‌గా 2014 బ్యాచ్ కి చెందిన మహిళా ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది గతంలోనే జాయింట్ కలెక్టర్ గా పులి శ్రీనివాసులను ప్రభుత్వ నియమించింది. Source link

Read More